Advertisement

పార్లమెంట్‌ ప్రాంగణంలో విపక్షాల స్కిట్.. పూజారిగా పప్పూ యాదవ్, భక్తుడిగా రాహుల్.. వీడియో ఇదిగో!

Opposition skit in Parliament Pappu Yadav acts as priest and Rahul Gandhi as devotee
  • అయోధ్య నిధుల అవకతవకలపై విపక్షాల నిరసన
  • వీధి నాటకం రూపంలో విపక్షాల వినూత్న ప్రదర్శన
  • సభలో చర్చకు అనుమతించకపోవడంతో ఆందోళన
  • అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్
అయోధ్య రామ మందిరం నిర్మాణ నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను నిరసిస్తూ, విపక్ష నాయకులు పార్లమెంట్ ప్రాంగణంలో వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ (రాజేశ్ రంజన్) కాషాయ వస్త్రాలు ధరించి పూజారి వేషంలో రాగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా 'ఇండియా' కూటమి నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంట్‌లోని మకార్ ద్వార్ వద్ద ఈ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా విపక్ష ఎంపీలు పార్లమెంట్ మెట్లపై విరాళాల పెట్టెలను ఉంచారు. పూజారి వేషధారణలో ఉన్న పప్పూ యాదవ్ శ్రీరాముడి చిత్రపటం పక్కన కూర్చున్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అవధేశ్ ప్రసాద్ తదితరులు భక్తుల తరహాలో వచ్చి ఆ హుండీల్లో నగదు వేశారు. అనంతరం పప్పూ యాదవ్ ఆ డబ్బును తన జేబులో వేసుకోవడం, హుండీని తీసుకుని వెళ్లడం, దాంతో అతడికి దేహశుద్ధి చేయడం వంటి చేష్టల ద్వారా నిధుల దుర్వినియోగాన్ని ప్రతీకాత్మకంగా అభినయించి చూపారు.

ఈ నిరసనలో "అమిత్ షా రాజీనామా చేయాలి", "చందాల దొంగ గద్దె దిగాలి" అంటూ విపక్ష నేతలు భారీ ఎత్తున నినాదాలు చేశారు.

ఈ అంశంపై సభలో చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే ఈ విధంగా నిరసన తెలపాల్సి వచ్చిందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భక్తులకు రసీదులు ఇవ్వకుండా, నిధులు అధికారిక హుండీలకు చేరకుండా పక్కదారి పట్టించారని, ఈ అవకతవకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సైతం తొలగించారని ఆయన ఆరోపించారు. కాగా, సభ్యులు ఇలాంటి విభిన్న వేషధారణలతో సభకు రావడం సరికాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
Advertisement
Pappu Yadav
Rahul Gandhi
Opposition Parliament Protest
Ram Mandir Donation Scam Allegations

More Telugu News