పల్నాడులో జర్మన్ వధువుతో యువకుడి పెళ్లి.. రెండు సంప్రదాయాల నడుమ వేడుక
- పల్నాడు యువకుడికి జర్మన్ యువతితో వివాహం
- నరసరావుపేటలో హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వేడుక
- జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ
- ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటైన జంట
వివరాల్లోకి వెళితే.. నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన యంపటి వెంకటేశ్వర్లు ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం జర్మనీ వెళ్లారు. అక్కడ ఆయనకు రష్యాకు చెందిన, ప్రస్తుతం జర్మనీలో స్థిరపడిన పాలినాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ వృత్తిరీత్యా స్థిరపడిన తర్వాత, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వెంకటేశ్వర్లు కుటుంబం కొన్నేళ్లుగా నరసరావుపేటలో నివాసం ఉంటుండటంతో, వివాహ వేడుకను ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. విదేశీ వధువు పాలినా భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ వివాహ వేడుకలో పాల్గొనడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.