లడఖ్లోని ఆ అద్భుత ఆశ్రమానికి దారే లేదు.. పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారో తెలుసా?
- సముద్ర మట్టానికి 3,580 మీటర్ల ఎత్తులో కొండగుహలో ఫుగ్తాల్ ఆశ్రమం
- బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని వైనం
- దేశంలోని అత్యంత అరుదైన ఆశ్రమంగా గుర్తింపు
- టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ విభాగానికి చెందిన జంగ్సెం షేరప్ జంగ్పో 15వ శతాబ్దం ప్రారంభంలో ఆశ్రమ స్థాపన
లడఖ్ అనగానే బైక్ రైడర్లు, పర్వత శ్రేణులు, అద్భుతమైన రహదారులు గుర్తుకువస్తాయి. కానీ, అదే లడఖ్లోని కఠినమైన కొండల మధ్య, ఒక నదీ లోయపై ఉన్న నిలువుటాకారపు కొండ అంచున భారతదేశంలోని అత్యంత అరుదైన ఆశ్రమం ఒకటి ఉంది. అదే 'ఫుగ్తాల్ మొనాస్టరీ' (Phugtal Monastery). సాధారణ పర్యాటక ప్రాంతాల వలె మనం వాహనాలలో నేరుగా ఈ ఆశ్రమం వద్దకు వెళ్లలేము. ఎందుకంటే, ఇక్కడికి వెళ్లేందుకు ఎలాంటి ప్రత్యక్ష రహదారులు లేవు. ఇక్కడ షాపింగ్ మార్కెట్లు కానీ, మిమ్మల్ని బాహ్య ప్రపంచంతో ముడిపెట్టే మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కానీ అస్సలు ఉండవు. నిజమైన ప్రశాంతతను, సాహసాన్ని, శతాబ్దాలుగా మారని హిమాలయ జీవనశైలిని చూడాలనుకునే వారికి ఫుగ్తాల్ ఒక అద్భుతమైన వేదిక.
లడఖ్లోని జన్స్కార్ (Zanskar) ప్రాంతంలో ఉన్న సుదూర లుంగ్నాక్ లోయలో ఫుగ్తాల్ మొనాస్టరీ ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3,850 మీటర్ల ఎత్తులో, త్సారాప్ (Tsarap) నదికి పైభాగంలో ఉన్న ఒక సహజ గుహలో దీనిని నిర్మించారు. ఈ పేరు వెనుక ఒక ప్రత్యేక అర్ధం ఉంది. ఇక్కడి స్థానిక భాషలో 'ఫుగ్' (Phug) అంటే గుహ అని, 'తాల్' (Tal) అంటే విముక్తి అని అర్థం. అంటే ఇది 'విముక్తిని ప్రసాదించే గుహ'. దీనిని దూరం నుంచి చూసినప్పుడు కొండపై నుంచి కిందకు జారిపడుతున్న ఒక భారీ తేనెతుట్టె (Honeycomb) వలె కనిపిస్తుంది. బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండటం వల్లే ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.
అక్కడ రోడ్లు ఎందుకు లేవు?
ఈ ఆశ్రమానికి రోడ్డు మార్గం లేకపోవడానికి ఇక్కడి కఠినమైన భౌగోళిక పరిస్థితులతో పాటు, ఈ చారిత్రక ప్రదేశాన్ని సంరక్షించాలనే బలమైన సంకల్పం కూడా కారణం. ఈ మొనాస్టరీ ఒక ఇరుకైన లోయలోని నిలువు కొండ అంచున దీనిని నిర్మించారు. ఇక్కడికి వాహనాలు వెళ్లేలా రోడ్డు నిర్మించాలంటే భారీగా పేలుళ్లు (Blasting) జరపాలి. కొండలను తవ్వాల్సి ఉంటుంది. ఆ విధమైన భారీ నిర్మాణ పనుల వల్ల ఇక్కడి పురాతన గుహ దెబ్బతినడమే కాకుండా, మట్టి, కలపతో నిర్మించిన బలహీనమైన ఆశ్రమ భవనాలు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ప్రయాణంలో చివరి దశను కేవలం కాలినడకన మాత్రమే పూర్తి చేయాలి. జన్స్కార్ ప్రాంతంలోకి రోడ్లు నెమ్మదిగా విస్తరిస్తున్నప్పటికీ, ఫుగ్తాల్ మాత్రం వాహనాలకు అందనంత దూరంలోనే సురక్షితంగా ఉంది.
పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారు?
ఈ ఆశ్రమాన్ని సందర్శించాలనుకునే వారి ప్రయాణం సాధారణంగా లేహ్ లేదా కార్గిల్ నుంచి ప్రారంభమై, మొదట జన్స్కార్లోని ప్రధాన పట్టణమైన పదుమ్ (Padum)కు చేరుకుంటుంది. పదుమ్ నుంచి వాహనాలలో పుర్నే (Purne) లేదా చాహ్ (Chah) గ్రామాలకు చేరుకోవచ్చు. చాలా మంది పర్యాటకులు పుర్నే గ్రామం నుంచే తమ ట్రెకింగ్ను ప్రారంభిస్తారు. పుర్నే నుంచి ఆశ్రమానికి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనిని చేరుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఈ నడక దారి త్సారప్ నది ఒడ్డున, ఒక అందమైన లోయ గుండా సాగుతుంది. ప్రయాణంలో ఒక ఊగే సస్పెన్షన్ వంతెనను (Suspension Bridge) దాటిన తర్వాత, ఆశ్రమం వైపు చివరి కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఈ దూరం తక్కువే అయినప్పటికీ, చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, నీలి రంగు నీరు, జన్స్కార్ పర్వతాల ముడి అందాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
వెయ్యి ఏళ్లకు పైగా చరిత్ర
ఈ సహజ గుహ దాదాపు 2,000 సంవత్సరాలుగా ధ్యానం చేసుకునే ఆధ్యాత్మిక సాధకులను ఆకర్షిస్తోంది. హిమాలయాలకు బౌద్ధమతాన్ని పరిచయం చేసిన గొప్ప గురువు పద్మసంభవతో సహా పలువురు ప్రముఖ బౌద్ధ గురువులకు ఈ గుహతో సంబంధం ఉందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ ఆశ్రమాన్ని 15వ శతాబ్దం ప్రారంభంలో టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ (Gelug) విభాగానికి చెందిన జంగ్సెం షేరప్ జంగ్పో (Jangsem Sherap Zangpo) స్థాపించారు. అప్పటి నుంచి ఇది విద్య, ధ్యానం, ప్రార్థనలకు ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రస్తుత కాలంలో కూడా డజన్ల కొద్దీ బౌద్ధ సన్యాసులు (Monks) ఇక్కడే నివసిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
లడఖ్లోని జన్స్కార్ (Zanskar) ప్రాంతంలో ఉన్న సుదూర లుంగ్నాక్ లోయలో ఫుగ్తాల్ మొనాస్టరీ ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3,850 మీటర్ల ఎత్తులో, త్సారాప్ (Tsarap) నదికి పైభాగంలో ఉన్న ఒక సహజ గుహలో దీనిని నిర్మించారు. ఈ పేరు వెనుక ఒక ప్రత్యేక అర్ధం ఉంది. ఇక్కడి స్థానిక భాషలో 'ఫుగ్' (Phug) అంటే గుహ అని, 'తాల్' (Tal) అంటే విముక్తి అని అర్థం. అంటే ఇది 'విముక్తిని ప్రసాదించే గుహ'. దీనిని దూరం నుంచి చూసినప్పుడు కొండపై నుంచి కిందకు జారిపడుతున్న ఒక భారీ తేనెతుట్టె (Honeycomb) వలె కనిపిస్తుంది. బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండటం వల్లే ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.
అక్కడ రోడ్లు ఎందుకు లేవు?
ఈ ఆశ్రమానికి రోడ్డు మార్గం లేకపోవడానికి ఇక్కడి కఠినమైన భౌగోళిక పరిస్థితులతో పాటు, ఈ చారిత్రక ప్రదేశాన్ని సంరక్షించాలనే బలమైన సంకల్పం కూడా కారణం. ఈ మొనాస్టరీ ఒక ఇరుకైన లోయలోని నిలువు కొండ అంచున దీనిని నిర్మించారు. ఇక్కడికి వాహనాలు వెళ్లేలా రోడ్డు నిర్మించాలంటే భారీగా పేలుళ్లు (Blasting) జరపాలి. కొండలను తవ్వాల్సి ఉంటుంది. ఆ విధమైన భారీ నిర్మాణ పనుల వల్ల ఇక్కడి పురాతన గుహ దెబ్బతినడమే కాకుండా, మట్టి, కలపతో నిర్మించిన బలహీనమైన ఆశ్రమ భవనాలు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ప్రయాణంలో చివరి దశను కేవలం కాలినడకన మాత్రమే పూర్తి చేయాలి. జన్స్కార్ ప్రాంతంలోకి రోడ్లు నెమ్మదిగా విస్తరిస్తున్నప్పటికీ, ఫుగ్తాల్ మాత్రం వాహనాలకు అందనంత దూరంలోనే సురక్షితంగా ఉంది.
పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారు?
ఈ ఆశ్రమాన్ని సందర్శించాలనుకునే వారి ప్రయాణం సాధారణంగా లేహ్ లేదా కార్గిల్ నుంచి ప్రారంభమై, మొదట జన్స్కార్లోని ప్రధాన పట్టణమైన పదుమ్ (Padum)కు చేరుకుంటుంది. పదుమ్ నుంచి వాహనాలలో పుర్నే (Purne) లేదా చాహ్ (Chah) గ్రామాలకు చేరుకోవచ్చు. చాలా మంది పర్యాటకులు పుర్నే గ్రామం నుంచే తమ ట్రెకింగ్ను ప్రారంభిస్తారు. పుర్నే నుంచి ఆశ్రమానికి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనిని చేరుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఈ నడక దారి త్సారప్ నది ఒడ్డున, ఒక అందమైన లోయ గుండా సాగుతుంది. ప్రయాణంలో ఒక ఊగే సస్పెన్షన్ వంతెనను (Suspension Bridge) దాటిన తర్వాత, ఆశ్రమం వైపు చివరి కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఈ దూరం తక్కువే అయినప్పటికీ, చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, నీలి రంగు నీరు, జన్స్కార్ పర్వతాల ముడి అందాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
వెయ్యి ఏళ్లకు పైగా చరిత్ర
ఈ సహజ గుహ దాదాపు 2,000 సంవత్సరాలుగా ధ్యానం చేసుకునే ఆధ్యాత్మిక సాధకులను ఆకర్షిస్తోంది. హిమాలయాలకు బౌద్ధమతాన్ని పరిచయం చేసిన గొప్ప గురువు పద్మసంభవతో సహా పలువురు ప్రముఖ బౌద్ధ గురువులకు ఈ గుహతో సంబంధం ఉందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ ఆశ్రమాన్ని 15వ శతాబ్దం ప్రారంభంలో టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ (Gelug) విభాగానికి చెందిన జంగ్సెం షేరప్ జంగ్పో (Jangsem Sherap Zangpo) స్థాపించారు. అప్పటి నుంచి ఇది విద్య, ధ్యానం, ప్రార్థనలకు ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రస్తుత కాలంలో కూడా డజన్ల కొద్దీ బౌద్ధ సన్యాసులు (Monks) ఇక్కడే నివసిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు.