అంతర్జాతీయ కెరీర్కు దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ గుడ్బై
- 378 మ్యాచ్ల్లో 19,346 పరుగులతో రికార్డు
- 2021లో కివీస్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అందించిన కెప్టెన్
- 48 వన్డే సెంచరీలు, 33 టెస్టు శతకాలతో అద్భుత కెరీర్
- ‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా చిరస్థాయిగా విలియమ్సన్
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన 35 ఏళ్ల కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దాదాపు 16 ఏళ్ల పాటు సాగిన తన అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలుకుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు. సొగసైన బ్యాటింగ్, అద్భుతమైన నాయకత్వం, అసాధారణ స్థిరత్వంతో ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెరీర్ను ముగించాడు.
2010లో భారత జట్టుపై దంబుల్లాలో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్ మొత్తం 378 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 19,346 పరుగులు చేసి న్యూజిలాండ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇందులో 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో 9,515 పరుగులు చేశారు. 33 సెంచరీలు నమోదు చేసి దేశ చరిత్రలో ఉత్తమ బ్యాటర్గా నిలిచాడు.
రిటైర్మెంట్ సందర్భంగా విలియమ్సన్ భావోద్వేగంగా స్పందించాడు. ‘‘కొంతకాలంగా ఈ నిర్ణయం గురించి ఆలోచిస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఇదే సరైన సమయం అని నాకు స్పష్టమైంది. న్యూజిలాండ్ కోసం ఆడటం నా జీవితంలో అత్యంత గర్వకారణం. ప్రతి మ్యాచ్లో నా శక్తి మేరకు 100 శాతం ఇచ్చాను’’ అని తెలిపాడు.
కెప్టెన్గా కూడా విలియమ్సన్ న్యూజిలాండ్కు స్వర్ణయుగాన్ని అందించాడు. అతని నాయకత్వంలో కివీస్ జట్టు 2021లో తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. అలాగే రెండు ఐసీసీ ఫైనల్స్తో పాటు పలు ప్రపంచ టోర్నీల సెమీఫైనల్స్కు చేరుకుంది. 2015లో ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’, 2019లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్నాడు. సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ను రికార్డు స్థాయిలో నాలుగు సార్లు గెలుచుకున్నాడు.
ఇటీవల కాలంలో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్లపై దృష్టి పెట్టాలని విలియమ్సన్ నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. 2026లో ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు అసిస్టెంట్ కోచ్గా చేరడం కూడా అతని అంతర్జాతీయ కెరీర్ ముగింపునకు సంకేతంగా కనిపించింది. ‘ఫ్యాబ్ ఫోర్’గా పేరుగాంచిన ఆధునిక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన కేన్ విలియమ్సన్ తన నైపుణ్యం, అందమైన బ్యాటింగ్ శైలి, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడే స్వభావంతో క్రికెట్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ప్రపంచ క్రికెట్ లో కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్ 'ఫ్యాబ్ ఫోర్'గా పేరుపొందారు.
2010లో భారత జట్టుపై దంబుల్లాలో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్ మొత్తం 378 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 19,346 పరుగులు చేసి న్యూజిలాండ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇందులో 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో 9,515 పరుగులు చేశారు. 33 సెంచరీలు నమోదు చేసి దేశ చరిత్రలో ఉత్తమ బ్యాటర్గా నిలిచాడు.
రిటైర్మెంట్ సందర్భంగా విలియమ్సన్ భావోద్వేగంగా స్పందించాడు. ‘‘కొంతకాలంగా ఈ నిర్ణయం గురించి ఆలోచిస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఇదే సరైన సమయం అని నాకు స్పష్టమైంది. న్యూజిలాండ్ కోసం ఆడటం నా జీవితంలో అత్యంత గర్వకారణం. ప్రతి మ్యాచ్లో నా శక్తి మేరకు 100 శాతం ఇచ్చాను’’ అని తెలిపాడు.
కెప్టెన్గా కూడా విలియమ్సన్ న్యూజిలాండ్కు స్వర్ణయుగాన్ని అందించాడు. అతని నాయకత్వంలో కివీస్ జట్టు 2021లో తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. అలాగే రెండు ఐసీసీ ఫైనల్స్తో పాటు పలు ప్రపంచ టోర్నీల సెమీఫైనల్స్కు చేరుకుంది. 2015లో ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’, 2019లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్నాడు. సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ను రికార్డు స్థాయిలో నాలుగు సార్లు గెలుచుకున్నాడు.
ఇటీవల కాలంలో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్లపై దృష్టి పెట్టాలని విలియమ్సన్ నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. 2026లో ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు అసిస్టెంట్ కోచ్గా చేరడం కూడా అతని అంతర్జాతీయ కెరీర్ ముగింపునకు సంకేతంగా కనిపించింది. ‘ఫ్యాబ్ ఫోర్’గా పేరుగాంచిన ఆధునిక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన కేన్ విలియమ్సన్ తన నైపుణ్యం, అందమైన బ్యాటింగ్ శైలి, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడే స్వభావంతో క్రికెట్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ప్రపంచ క్రికెట్ లో కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్ 'ఫ్యాబ్ ఫోర్'గా పేరుపొందారు.