కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి
- క్షిపణులు, డ్రోన్లతో కువైట్పై ఇరాన్ దాడి
- దాడిని గాల్లోనే అడ్డుకున్న కువైట్ సైన్యం
- అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులని ప్రకటించిన ఇరాన్
- ఇరాన్లోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవిలోనూ పేలుళ్ల కలకలం
మరోవైపు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తమ టెలికమ్యూనికేషన్ యాంటెన్నా, చమురు ట్యాంకర్పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ ప్రాంతంలోని అమెరికా 5వ నౌకాదళం (Fifth Fleet), అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా తాము దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ ఛానల్ 'ఐఆర్ఐబీ' (IRIB) వెల్లడించింది. అమెరికా దురాక్రమణకు దిగితే మరింత తీవ్రమైన సమాధానం ఉంటుందని తాము ముందే హెచ్చరించామని, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నామని ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ దేశంలో హెచ్చరిక సైరన్లను అప్రమత్తం చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
ఈ ఉద్రిక్తతలకు ముందు మంగళవారం ( 2న) హర్మూజ్ జలసంధి సమీపంలోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవిలో ఉన్న ఇరాన్ సైనిక డ్రోన్ కంట్రోల్ స్టేషన్పై తాము దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. మధ్యప్రాచ్య ప్రాంతంలో పౌర నౌకలపైకి ఇరాన్ ప్రయోగించిన మూడు డ్రోన్లు, పొరుగు దేశాలపైకి వేసిన బాలిస్టిక్ క్షిపణులను అమెరికా దళాలు విజయవంతంగా అడ్డుకున్న తర్వాతే, ఆత్మరక్షణ కోసమే తాము ఖెష్మ్ దీవిపై ఈ ప్రతిదాడి జరిపినట్లు అమెరికా సైన్యం వివరించింది. ప్రాంతీయ భద్రతను, అంతర్జాతీయ సముద్ర రవాణాను రక్షించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా అధికారులు తెలిపారు.