ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా జగన్?: నారా లోకేష్
- నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
- ఇది వైసీపీ నేతల కుట్ర అని లోకేష్ ఫైర్
- జగన్ తన 'గొడ్డలి పార్టీ' కార్యకర్తలతో అశాంతి సృష్టిస్తున్నారని విమర్శలు
- జగన్ కుట్ర రాజకీయాలు మానడం లేదని ఆగ్రహం
నంద్యాలలో ఇటీవల జరిగిన వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటనను ప్రస్తావిస్తూ, దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని లోకేష్ ఆరోపించారు. ఈ ఘటనలో నిందితుడైన జమ్ములయ్య, స్థానిక వైసీపీ నేతల అనుచరుడేనని పోలీసుల విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉటంకిస్తూ, జగన్ తన 'గొడ్డలి పార్టీ' కార్యకర్తలతో అశాంతి సృష్టిస్తున్నారని విమర్శించారు.
బాబాయ్ గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి వంటి నాటకాలతో ప్రజలను మోసం చేసిన జగన్, ఇప్పుడు కూడా అదే తరహా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. "ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా జగన్?" అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. అధికారంలో లేకపోయినా జగన్ తీరు మారడం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు.