ముగిసిన 'కాంతార' వివాదం: చాముండేశ్వరి ఆలయంలో క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్

  • 'కాంతార' మిమిక్రీ వివాదంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్
  • కోర్టు ఆదేశాల మేరకు చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి
  • అమ్మవారికి క్షమాపణలు చెప్పి ప్రత్యేక పూజలు
  • ఈ పరిణామంతో వివాదానికి పూర్తిగా తెరపడినట్లు వెల్లడి
  • రణ్‌వీర్‌పై నిషేధం వదంతులకు కూడా చెక్ పడినట్లేనని విశ్లేషణ
బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్, తీవ్ర వివాదాస్పదమైన 'కాంతార' మిమిక్రీ వివాదానికి ముగింపు పలికారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం కర్ణాటకలోని చాముండి కొండపై వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. గర్భగుడిలో అమ్మవారికి క్షమాపణలు తెలిపి, ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కు తీర్చుకున్నారు. దీంతో ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగింది.

కొన్ని నెలల క్రితం గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ వివాదం మొదలైంది. 'కాంతార' చిత్రంలోని పవిత్రమైన 'దైవ' పాత్రను రణ్‌వీర్ సింగ్ అగౌరవపరిచేలా అనుకరించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నటుడు రిషబ్ శెట్టి వారించినా రణ్‌వీర్ తన మిమిక్రీని ఆపలేదని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టులో ఫిర్యాదు దాఖలు కాగా, న్యాయస్థానం రణ్‌వీర్ తీరును తప్పుబట్టింది. అయితే, రణ్‌వీర్ కోర్టుకు క్షమాపణ చెప్పడంతో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. నాలుగు వారాల్లోగా చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి క్షమాపణలు చెప్పాలనే షరతు విధించింది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం ఆలయానికి చేరుకున్న రణ్‌వీర్, పూజలతో తన మొక్కు తీర్చుకున్నారు. 

Ranveer Singh
Kantara controversy
Chamundeshwari Temple
Rishab Shetty
Mimicry controversy
Karnataka High Court
Bollywood
Chamundi Hills
Apology
International Film Festival Goa

More Telugu News