ఉచిత విద్యుత్ రద్దుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
- వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం కుట్రేనన్న కేటీఆర్
- ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయడానికే ఈ నిర్ణయమని ఆరోపణ
- మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్లు పెడతారని వ్యాఖ్య
- గతంలో కేసీఆర్ ఒప్పుకోని పనిని కాంగ్రెస్ చేస్తోందని విమర్శ
తెలంగాణలో రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు. ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యవసాయ కనెక్షన్లతో పాటు అన్ని గృహ కనెక్షన్లకూ ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లలోని పాత మీటర్లను తొలగించి, వాటి స్థానంలో ఈ కొత్త ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు.
గతంలో ప్రధాని మోదీ ఎంత ఒత్తిడి తెచ్చినా, రూ. 30,000 కోట్ల రుణం నిలిపివేసినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీటర్లు పెట్టడానికి అంగీకరించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే మీటర్లు బిగించాలని నిర్ణయించిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ రద్దు అవుతుందని, మోటార్లకు మీటర్లు వస్తాయని తాము హెచ్చరించిన విషయం ఇప్పుడు నిజమవుతోందని అన్నారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకముందే, ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లు రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అరాచకాలతో పాలన సాగిస్తోందని, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యవసాయ కనెక్షన్లతో పాటు అన్ని గృహ కనెక్షన్లకూ ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లలోని పాత మీటర్లను తొలగించి, వాటి స్థానంలో ఈ కొత్త ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు.
గతంలో ప్రధాని మోదీ ఎంత ఒత్తిడి తెచ్చినా, రూ. 30,000 కోట్ల రుణం నిలిపివేసినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీటర్లు పెట్టడానికి అంగీకరించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే మీటర్లు బిగించాలని నిర్ణయించిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ రద్దు అవుతుందని, మోటార్లకు మీటర్లు వస్తాయని తాము హెచ్చరించిన విషయం ఇప్పుడు నిజమవుతోందని అన్నారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకముందే, ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లు రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అరాచకాలతో పాలన సాగిస్తోందని, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.