యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు.. పేటీఎం 'పాకెట్ మనీ' వచ్చేసింది!
- బ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్ల కోసం పేటీఎం 'పాకెట్ మనీ' ఫీచర్
- తల్లిదండ్రుల పర్యవేక్షణలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు
- ఎన్పీసీఐ 'యూపీఐ సర్కిల్' ఫీచర్ ఆధారంగా అందుబాటులోకి ఈ సేవలు
- నెలవారీ ఖర్చులకు పరిమితులు విధించుకునే సౌకర్యం
- రోజుకు రూ.5,000.. నెలకు రూ.15,000 వరకు లావాదేవీల పరిమితి
డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం, టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని మరో కీలకమైన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. 'పేటీఎం పాకెట్ మనీ' పేరుతో నేడు ప్రారంభించిన ఈ కొత్త సదుపాయం ద్వారా బ్యాంకు ఖాతా లేని టీనేజర్లు కూడా నేరుగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు అవకాశం కలుగుతుంది. నగదు కోసం లేదా చెల్లింపులు పూర్తి చేయడానికి తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం ఉందని కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన ప్రకటనలో తెలిపింది.
ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు తమ పిల్లల నెలవారీ ఖర్చులకు పరిమితి విధించవచ్చు. అంతేగాక వారు చేసే యూపీఐ లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. "పేటీఎం స్పెండ్ సమ్మరీతో కుటుంబాలు తమ పిల్లల ఖర్చుల సరళిని సమీక్షించుకోవచ్చు. వారికి ఇచ్చే పాకెట్ మనీని మెరుగ్గా నిర్వహించడంతో పాటు సురక్షితమైన, బాధ్యతాయుతమైన అలవాట్లను చిన్నతనం నుంచే నేర్పించవచ్చు" అని పేటీఎం ఒక ప్రకటనలో పేర్కొంది. పాఠశాల, కళాశాల క్యాంటీన్లు, మెట్రో రైళ్లు, క్యాబ్లు, మొబైల్ రీఛార్జ్లు, షాపింగ్ వంటి రోజువారీ అవసరాలకు ఈ ఫీచర్ టీనేజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
'పేటీఎం పాకెట్ మనీ' ఎలా పనిచేస్తుంది?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన 'యూపీఐ సర్కిల్' ఫీచర్ ఆధారంగా ఈ సేవ పనిచేస్తుంది. యూపీఐ సర్కిల్ ద్వారా బ్యాంకు ఖాతా కలిగిన ప్రాథమిక యూజర్ (తల్లి/తండ్రి), తమ కుటుంబ సభ్యులను లేదా నమ్మకమైన వారిని సెకండరీ యూజర్గా చేర్చుకోవచ్చు. దీనివల్ల ఒకే బ్యాంకు ఖాతాకు సంబంధించిన యూపీఐ ఐడీని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపయోగించుకోవచ్చు. అయితే, లావాదేవీలపై పూర్తి నియంత్రణ, పరిమితులు విధించే అధికారం ప్రాథమిక యూజర్కే ఉంటుంది.
ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత టీనేజర్లు తమ సొంత మొబైల్ ఫోన్లోని పేటీఎం యాప్ ద్వారా సురక్షితంగా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. "ఇకపై టీనేజర్లు చెల్లింపుల కోసం తమ తల్లిదండ్రుల ఫోన్ తీసుకోవడం, ఓటీపీల కోసం అడగడం లేదా క్యూఆర్ కోడ్ను వాట్సాప్లో పంపడం వంటివి చేయాల్సిన అవసరం లేదు" అని కంపెనీ పేర్కొంది.
పరిమితులు.. భద్రతా నియంత్రణలు
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ పాకెట్ మనీని సెటప్ చేసేటప్పుడు, లావాదేవీలపై పరిమితులు విధించవచ్చు. ప్రతి లావాదేవీ గరిష్ఠంగా రూ. 5,000, నెలవారీ మొత్తం ఖర్చు రూ. 15,000 మించకుండా పరిమితి ఉంటుంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఫీచర్ సెటప్ చేసిన మొదటి 30 నిమిషాల్లో రూ. 500, మొదటి 24 గంటల్లో రూ. 5,000 వరకు మాత్రమే చెల్లింపులు చేయగలరు. ఈ ఫీచర్ వాడటానికి డివైస్ లాక్ తప్పనిసరి. తల్లిదండ్రులు తమ పేటీఎం యూపీఐ పిన్ ఉపయోగించి ఎప్పుడైనా ఈ పరిమితులను మార్చవచ్చు లేదా యాక్సెస్ను తక్షణమే రద్దు చేయవచ్చు.
యాక్టివేట్ చేసుకునే విధానం:
ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు తమ పిల్లల నెలవారీ ఖర్చులకు పరిమితి విధించవచ్చు. అంతేగాక వారు చేసే యూపీఐ లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. "పేటీఎం స్పెండ్ సమ్మరీతో కుటుంబాలు తమ పిల్లల ఖర్చుల సరళిని సమీక్షించుకోవచ్చు. వారికి ఇచ్చే పాకెట్ మనీని మెరుగ్గా నిర్వహించడంతో పాటు సురక్షితమైన, బాధ్యతాయుతమైన అలవాట్లను చిన్నతనం నుంచే నేర్పించవచ్చు" అని పేటీఎం ఒక ప్రకటనలో పేర్కొంది. పాఠశాల, కళాశాల క్యాంటీన్లు, మెట్రో రైళ్లు, క్యాబ్లు, మొబైల్ రీఛార్జ్లు, షాపింగ్ వంటి రోజువారీ అవసరాలకు ఈ ఫీచర్ టీనేజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
'పేటీఎం పాకెట్ మనీ' ఎలా పనిచేస్తుంది?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన 'యూపీఐ సర్కిల్' ఫీచర్ ఆధారంగా ఈ సేవ పనిచేస్తుంది. యూపీఐ సర్కిల్ ద్వారా బ్యాంకు ఖాతా కలిగిన ప్రాథమిక యూజర్ (తల్లి/తండ్రి), తమ కుటుంబ సభ్యులను లేదా నమ్మకమైన వారిని సెకండరీ యూజర్గా చేర్చుకోవచ్చు. దీనివల్ల ఒకే బ్యాంకు ఖాతాకు సంబంధించిన యూపీఐ ఐడీని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపయోగించుకోవచ్చు. అయితే, లావాదేవీలపై పూర్తి నియంత్రణ, పరిమితులు విధించే అధికారం ప్రాథమిక యూజర్కే ఉంటుంది.
ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత టీనేజర్లు తమ సొంత మొబైల్ ఫోన్లోని పేటీఎం యాప్ ద్వారా సురక్షితంగా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. "ఇకపై టీనేజర్లు చెల్లింపుల కోసం తమ తల్లిదండ్రుల ఫోన్ తీసుకోవడం, ఓటీపీల కోసం అడగడం లేదా క్యూఆర్ కోడ్ను వాట్సాప్లో పంపడం వంటివి చేయాల్సిన అవసరం లేదు" అని కంపెనీ పేర్కొంది.
పరిమితులు.. భద్రతా నియంత్రణలు
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ పాకెట్ మనీని సెటప్ చేసేటప్పుడు, లావాదేవీలపై పరిమితులు విధించవచ్చు. ప్రతి లావాదేవీ గరిష్ఠంగా రూ. 5,000, నెలవారీ మొత్తం ఖర్చు రూ. 15,000 మించకుండా పరిమితి ఉంటుంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఫీచర్ సెటప్ చేసిన మొదటి 30 నిమిషాల్లో రూ. 500, మొదటి 24 గంటల్లో రూ. 5,000 వరకు మాత్రమే చెల్లింపులు చేయగలరు. ఈ ఫీచర్ వాడటానికి డివైస్ లాక్ తప్పనిసరి. తల్లిదండ్రులు తమ పేటీఎం యూపీఐ పిన్ ఉపయోగించి ఎప్పుడైనా ఈ పరిమితులను మార్చవచ్చు లేదా యాక్సెస్ను తక్షణమే రద్దు చేయవచ్చు.
యాక్టివేట్ చేసుకునే విధానం:
- ముందుగా మీ ఫోన్లో పేటీఎం యాప్ను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి.
- యాప్ ఓపెన్ చేసి, 'To Mobile / Contact' ఆప్షన్పై ట్యాప్ చేయండి.
- అక్కడ కనిపించే 'Pocket Money' ఆప్షన్ను ఎంచుకుని సెటప్ ప్రారంభించండి.
- మీరు ఎవరికైతే ఈ ఫీచర్ సెటప్ చేయాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ను ఎంటర్ చేయండి.
- వారి యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి లేదా వారి యూపీఐ ఐడీని నమోదు చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్ వివరాలతో వెరిఫికేషన్ను పూర్తి చేయండి.
- నెలవారీ ఖర్చు పరిమితిని సెట్ చేయండి.
- మీ ప్రాథమిక బ్యాంకు ఖాతాను ఎంచుకుని, మీ పేటీఎం యూపీఐ పిన్ను ఎంటర్ చేసి సెటప్ను పూర్తి చేయండి.
- మీరు పంపిన ఇన్విటేషన్ను అవతలి వ్యక్తి అంగీకరించిన తర్వాత 'పేటీఎం పాకెట్ మనీ' యాక్టివేట్ అవుతుంది.