సీఎం సువేందు పీఏ హత్యకు కోటి ఖర్చు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
- చంద్రనాథ్ రథ్ది పక్కా సుపారీ హత్య అని సీబీఐ అనుమానం
- హత్యకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా
- రంగంలోకి సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం
- యూపీ, బిహార్లలో ముగ్గురు నిందితుల అరెస్ట్
- యూపీఐ చెల్లింపుతో చిక్కిన వైనం
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది సాధారణ హత్య కాదని, రూ. కోటికి పైగా ఖర్చు చేసి పక్కా ప్రణాళికతో అమలు చేసిన సుపారీ హత్య అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అనుమానిస్తోంది. ఈ హత్యలో అంతర్రాష్ట్ర ముఠాలు, నకిలీ వాహనాలు, అత్యాధునిక ఆయుధాలు వాడినట్లు దర్యాప్తులో తేలింది.
మంగళవారం సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో హత్య జరిగిన ప్రదేశాన్ని మరోసారి పరిశీలించింది. సీబీఐ డీఐజీ పంకజ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని బృందం, హత్య జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.
సుపారీకి కోటి రూపాయలు!
మే 6వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజులకే చంద్రనాథ్ రథ్ను ఆయన ఎస్యూవీలోనే దుండగులు కాల్చి చంపారు. ఈ ఆపరేషన్కు రూ. కోటికి పైగా ఖర్చయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆయుధాలు, నిఘా, వాహనాలు, కిరాయి హంతకుల కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. ఉపయోగించిన తుపాకుల్లో ఒకదాని విలువ అక్రమ మార్కెట్లో రూ.10 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎవరు సమకూర్చారనేది మిస్టరీగా మారింది.
యూపీఐ చెల్లింపుతో దొరికారు
హత్య తర్వాత నిందితులు నకిలీ నంబర్ ప్లేట్లున్న వాహనాలను వాడి పరారయ్యారు. అయితే, హౌరా జిల్లాలోని ఓ టోల్ ప్లాజా వద్ద నిందితులు చేసిన ఒక యూపీఐ చెల్లింపు ఆధారంగా దర్యాప్తు సంస్థలు వారిని గుర్తించాయి. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్, బిహార్లలో మయాంక్ రాజ్ మిశ్రా, విక్కీ మౌర్య, రాజ్ సింగ్లను అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తున్నప్పటికీ, ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, హత్యకు కారణమేమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.
మంగళవారం సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో హత్య జరిగిన ప్రదేశాన్ని మరోసారి పరిశీలించింది. సీబీఐ డీఐజీ పంకజ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని బృందం, హత్య జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.
సుపారీకి కోటి రూపాయలు!
మే 6వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజులకే చంద్రనాథ్ రథ్ను ఆయన ఎస్యూవీలోనే దుండగులు కాల్చి చంపారు. ఈ ఆపరేషన్కు రూ. కోటికి పైగా ఖర్చయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆయుధాలు, నిఘా, వాహనాలు, కిరాయి హంతకుల కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. ఉపయోగించిన తుపాకుల్లో ఒకదాని విలువ అక్రమ మార్కెట్లో రూ.10 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎవరు సమకూర్చారనేది మిస్టరీగా మారింది.
యూపీఐ చెల్లింపుతో దొరికారు
హత్య తర్వాత నిందితులు నకిలీ నంబర్ ప్లేట్లున్న వాహనాలను వాడి పరారయ్యారు. అయితే, హౌరా జిల్లాలోని ఓ టోల్ ప్లాజా వద్ద నిందితులు చేసిన ఒక యూపీఐ చెల్లింపు ఆధారంగా దర్యాప్తు సంస్థలు వారిని గుర్తించాయి. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్, బిహార్లలో మయాంక్ రాజ్ మిశ్రా, విక్కీ మౌర్య, రాజ్ సింగ్లను అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తున్నప్పటికీ, ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, హత్యకు కారణమేమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.