సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంట శుభకార్యం
- హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
- సీఎస్ సాయి ప్రసాద్ కుమార్తె త్రిలోక్య పావని, ప్రభాస్ల నిశ్చితార్థం
- బిజీ షెడ్యూల్లోనూ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి. సాయిప్రసాద్ ఇంట జరిగిన శుభకార్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సాయిప్రసాద్ కుమార్తె త్రిలోక్య పావని, ప్రభాస్ల నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం, కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన జి. సాయిప్రసాద్, ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా, నిశ్చితార్థ వేదిక వద్ద కోలాహలం నెలకొంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. ఉదయం టీడీపీ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.


1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన జి. సాయిప్రసాద్, ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా, నిశ్చితార్థ వేదిక వద్ద కోలాహలం నెలకొంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. ఉదయం టీడీపీ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

