ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ
- వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ఆందోళన
- పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
- సైబరాబాద్ పోలీస్ పెట్రోల్ బంకు వద్ద బారులు తీరిన కార్లు
పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా డీజిల్ దొరకడం లేదు. దీనితో ఇంధనం దొరికే బంకుల్లో రద్దీ పెరుగుతోంది. వాహనదారులు సైబరాబాద్ పోలీస్ పెట్రోల్ బంకు వద్దకు బారులు తీరారు. ఈ బంకు వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర కార్లు వరుస కట్టాయి.