కాకినాడలో 'మకుటం' షెడ్యూల్ పూర్తి.. చిత్ర బృందానికి విశాల్ ధన్యవాదాలు
- 'మకుటం' సినిమా కాకినాడ షెడ్యూల్ పూర్తి
- రెండు వారాల పాటు జరిగిన కీలక చిత్రీకరణ
- తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ షూటింగ్లో పాల్గొన్న విశాల్
- నటి అంజలితో పాటు చిత్ర బృందాన్ని ప్రశంసించిన హీరో
- చెన్నైలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని వెల్లడి
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ తన తాజా చిత్రం 'మకుటం' కోసం జరిపిన కీలక షెడ్యూల్ను పూర్తి చేశారు. గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జరిగిన ఈ చిత్రీకరణ ముగిసినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర బృందం చెన్నైకి తిరిగి వెళ్లింది.
సినిమాలోనే అత్యంత కష్టమైన 90ల నాటి నేపథ్యంలోని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించినట్లు విశాల్ తెలిపారు. ఈ రెండు వారాలు తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడినప్పటికీ, పట్టుదలతో షూటింగ్ పూర్తి చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన చిత్ర బృందానికి విశాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
"ఎలాంటి ఇగో లేకుండా వృత్తిపట్ల అంకితభావం చూపిన నా డార్లింగ్ అంజలికి, డీఓపీ అభినందన్కు, బృందా మాస్టర్కు, నా దర్శకత్వ బృందానికి, తీవ్రమైన ఎండలను తట్టుకుని పనిచేసిన నటీనటులందరికీ ధన్యవాదాలు" అని విశాల్ తన పోస్ట్లో రాశారు. తనకు అండగా నిలిచిన కాబోయే అర్ధాంగి సాయిధన్సికకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం నుంచి చెన్నైలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని విశాల్ వెల్లడించారు. త్వరలోనే జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతంలో సినిమా నుంచి తొలి సింగిల్ విడుదల కానుందని, ఆయన మ్యాజిక్ కోసం సిద్ధంగా ఉండాలని అభిమానులకు సూచించారు.
కాగా, మకుటం చిత్రానికి విశాల్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం ఈ చిత్రం తమిళంలో 'మగుడం' పేరుతో రూపుదిద్దుకుంటోంది.
సినిమాలోనే అత్యంత కష్టమైన 90ల నాటి నేపథ్యంలోని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించినట్లు విశాల్ తెలిపారు. ఈ రెండు వారాలు తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడినప్పటికీ, పట్టుదలతో షూటింగ్ పూర్తి చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన చిత్ర బృందానికి విశాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
"ఎలాంటి ఇగో లేకుండా వృత్తిపట్ల అంకితభావం చూపిన నా డార్లింగ్ అంజలికి, డీఓపీ అభినందన్కు, బృందా మాస్టర్కు, నా దర్శకత్వ బృందానికి, తీవ్రమైన ఎండలను తట్టుకుని పనిచేసిన నటీనటులందరికీ ధన్యవాదాలు" అని విశాల్ తన పోస్ట్లో రాశారు. తనకు అండగా నిలిచిన కాబోయే అర్ధాంగి సాయిధన్సికకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం నుంచి చెన్నైలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని విశాల్ వెల్లడించారు. త్వరలోనే జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతంలో సినిమా నుంచి తొలి సింగిల్ విడుదల కానుందని, ఆయన మ్యాజిక్ కోసం సిద్ధంగా ఉండాలని అభిమానులకు సూచించారు.
కాగా, మకుటం చిత్రానికి విశాల్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం ఈ చిత్రం తమిళంలో 'మగుడం' పేరుతో రూపుదిద్దుకుంటోంది.