బీటెక్ విద్యార్థులే లక్ష్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది: రాయపాటి శైలజ
- ట్రాఫికింగ్ పై విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన రాయపాటి శైలజ
- ట్రాఫికింగ్ అనేక రూపాల్లో జరుగుతుందన్న శైలజ
- ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారని వెల్లడి
ట్రాఫికింగ్ అనేది అనేక రూపాల్లో జరుగుతుందని శైలజ తెలిపారు. యువతను సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తున్నారని... ముఖ్యంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని చెప్పి, అక్కడకు తీసుకెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారని తెలిపారు. ఇది కొత్త రకం ట్రాఫికింగ్ అని చెప్పారు.
అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు విశాఖపట్నంలో రోబోటిక్ సిస్టమ్ వంటి ఆధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపారు. బాధితులను కేవలం రక్షించడమే కాకుండా, వారు అనుభవించే మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా అవసరమని ఆమె పేర్కొన్నారు. అపరిచితులతో సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.