పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది: ప్రధాని నరేంద్రమోదీ

India will never bow to any form of terror PM Modi
  • పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది
  • ఎక్స్ వేదికగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
  • ప్రాణాలు కోల్పోయిన అమాయకులను ఎప్పటికీ మరిచిపోలేమన్న మోదీ
పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ విషాదాన్ని, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారిని ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది అయింది. ఈ నేపథ్యంలో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టారు.

గత సంవత్సరం ఇదే రోజున పహల్గామ్‌లో దారుణమైన ఉగ్రదాడి జరిగిందని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వారిని స్మరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు, బంధువులకు ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. దుఃఖంలో, సంకల్పంలో దేశం మొత్తం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.

భారత్ ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కుట్రలు ఎన్నటికీ సఫలం కావని పేర్కొన్నారు. కాగా, గత సంవత్సరం ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
Pahalgam attack anniversary
PM Modi on Pahalgam attack anniversary

More Telugu News