అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి

Louisiana Shooting Eight Children Killed in Shreveport
  • అమెరికాలో మరోసారి కాల్పుల మోత
  • లూసియానాలో 8 మంది చిన్నారులు మృతి
  • పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. లూసియానా రాష్ట్రంలోని ష్రీవ్‌పోర్ట్‌‌లో జరిగిన ఈ దారుణంలో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు.

స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. లూసియానా రాష్ట్రం ష్రీవ్‌పోర్ట్‌‌ ప్రాంతంలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 1 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న ఎనిమిది మంది చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో కొందరు నిందితుడి బంధువులు కూడా ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.

దాడుల తర్వాత నిందితుడు ఓ కారును అపహరించి పారిపోయాడు. పోలీసులు వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా, కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తాము ఎదురుకాల్పులు జరపగా నిందితుడు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.
 
Go Back to Shorts
Louisiana Shooting
Shreveport Louisiana
US Shootings
Child Deaths
Gun Violence America
Crime News
Shooter Killed
Police Investigation

More Telugu News