హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్లో అందరికీ ఉచిత ప్రయాణం!
- జూన్ 2 నుంచి పథకం అమలుకు ప్రభుత్వ సన్నాహాలు
- ఏటా రూ.10 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్
- తొలుత ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని యోచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు.
ఈ పథకం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవతో సమావేశమయ్యారు. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి, ఫలితాలను బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు ఏటా రూ.10 కోట్ల ఆదాయం వస్తుండగా, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వ లేఖపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఒప్పందం (ఎంవోయూ) పంపాలని కోరింది. దాన్ని పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని తెలిపింది. అయితే, ఇదే సమయంలో ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన రూ.491.45 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైల్వే శాఖ కోరింది. రద్దీ వేళల్లో ట్రిప్పులు పెంచాలని, స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులపై రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం నడుచుకుంటామని బదులిచ్చింది.
ప్రస్తుతం నగరంలో 80 నుంచి 88 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడుస్తుండగా, రోజుకు సుమారు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. సమయపాలన లోపించడం, ట్రిప్పుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆదరణ తగ్గింది. ఉచిత ప్రయాణ పథకం అమలైతే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవతో సమావేశమయ్యారు. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి, ఫలితాలను బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు ఏటా రూ.10 కోట్ల ఆదాయం వస్తుండగా, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వ లేఖపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఒప్పందం (ఎంవోయూ) పంపాలని కోరింది. దాన్ని పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని తెలిపింది. అయితే, ఇదే సమయంలో ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన రూ.491.45 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైల్వే శాఖ కోరింది. రద్దీ వేళల్లో ట్రిప్పులు పెంచాలని, స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులపై రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం నడుచుకుంటామని బదులిచ్చింది.
ప్రస్తుతం నగరంలో 80 నుంచి 88 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడుస్తుండగా, రోజుకు సుమారు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. సమయపాలన లోపించడం, ట్రిప్పుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆదరణ తగ్గింది. ఉచిత ప్రయాణ పథకం అమలైతే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.