ఆశా భోంస్లే ఆశయాలకు ప్రతిరూపంగా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్.. మహారాష్ట్ర సీఎం ప్రకటన
దిగ్గజ గాయని, స్వర్గీయ ఆశా భోంస్లే ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆశాజీకి ఘన నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి సునేత్రా అజిత్ పవార్తో పాటు ఇతర కేబినెట్ సభ్యులు పాల్గొన్నారు.
సంగీత రంగంలో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను గతంలో ఆశా భోంస్లే స్వయంగా ప్రభుత్వానికి అందించారని ఫడ్నవిస్ గుర్తుచేశారు. "ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆశా తాయ్ కలలుగన్న ఆ సంస్థను సాకారం చేసేందుకు అవసరమైన అన్ని సానుకూల చర్యలు తీసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్, ఆశా భోంస్లే మృతికి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. అనంతరం కేబినెట్ సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తూ ఫడ్నవిస్ భావోద్వేగంగా మాట్లాడారు. "ఈరోజు సుమధుర స్వరాల ఉద్యానవనం నిర్మానుష్యంగా మారింది. ఆశా తాయ్ స్వరం సంగీతానికి ఆత్మ లాంటిది" అని అన్నారు. "'తోరా మన్ దర్పణ్ కెహలాయే' వంటి ఆర్ద్ర గీతాల నుంచి 'ఖల్లాస్' వంటి హుషారైన పాటల వరకు ఆమె ప్రతి భావాన్నీ సులభంగా పలికించారు. భక్తి గీతాలు, గజల్స్, క్లాసికల్, పాప్ అనే తేడా లేకుండా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు," అని కొనియాడారు. మరాఠీ, హిందీ సహా 20 భారతీయ, విదేశీ భాషల్లో 12,000కు పైగా పాటలు పాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె అని ప్రశంసించారు.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమాన్ని గుర్తుచేసుకుంటూ, "ప్రపంచ రేడియో దినోత్సవం రోజు మేమిద్దరం కలిశాం. అప్పుడు నాతో ‘అభీ నా జావో ఛోడ్ కర్...’ పాటను బలవంతంగా పాడించి, ‘చూశారా, ముఖ్యమంత్రితో పాట పాడించాను’ అని సరదాగా అన్నారు. అలాంటి వ్యక్తి ఇక మన మధ్య లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది" అని ఫడ్నవిస్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, దేశవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సంగీత రంగంలో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను గతంలో ఆశా భోంస్లే స్వయంగా ప్రభుత్వానికి అందించారని ఫడ్నవిస్ గుర్తుచేశారు. "ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆశా తాయ్ కలలుగన్న ఆ సంస్థను సాకారం చేసేందుకు అవసరమైన అన్ని సానుకూల చర్యలు తీసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్, ఆశా భోంస్లే మృతికి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. అనంతరం కేబినెట్ సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తూ ఫడ్నవిస్ భావోద్వేగంగా మాట్లాడారు. "ఈరోజు సుమధుర స్వరాల ఉద్యానవనం నిర్మానుష్యంగా మారింది. ఆశా తాయ్ స్వరం సంగీతానికి ఆత్మ లాంటిది" అని అన్నారు. "'తోరా మన్ దర్పణ్ కెహలాయే' వంటి ఆర్ద్ర గీతాల నుంచి 'ఖల్లాస్' వంటి హుషారైన పాటల వరకు ఆమె ప్రతి భావాన్నీ సులభంగా పలికించారు. భక్తి గీతాలు, గజల్స్, క్లాసికల్, పాప్ అనే తేడా లేకుండా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు," అని కొనియాడారు. మరాఠీ, హిందీ సహా 20 భారతీయ, విదేశీ భాషల్లో 12,000కు పైగా పాటలు పాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె అని ప్రశంసించారు.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమాన్ని గుర్తుచేసుకుంటూ, "ప్రపంచ రేడియో దినోత్సవం రోజు మేమిద్దరం కలిశాం. అప్పుడు నాతో ‘అభీ నా జావో ఛోడ్ కర్...’ పాటను బలవంతంగా పాడించి, ‘చూశారా, ముఖ్యమంత్రితో పాట పాడించాను’ అని సరదాగా అన్నారు. అలాంటి వ్యక్తి ఇక మన మధ్య లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది" అని ఫడ్నవిస్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, దేశవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.