రాజస్థాన్లో విచిత్రం.. ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. పొరపాటైందన్న పోలీసులు!
రాజస్థాన్లో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. కాలుష్యానికి ఏమాత్రం కారణం కాని ఎలక్ట్రిక్ వాహనానికి (ఈవీ) పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్ లేదంటూ ఓ పోలీసు అధికారి చలాన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లాలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఆపారు. కారు అద్దాలకు సన్షేడ్స్ ఉన్నాయని మొదట రూ. 200 జరిమానా విధించారు. ఆ తర్వాత పీయూసీ సర్టిఫికెట్ చూపించమని అడగ్గా, ఎలక్ట్రిక్ వాహనానికి అది అవసరం లేదని కారు యజమాని వాదించారు. అయినప్పటికీ అధికారి వినిపించుకోకుండా పీయూసీ లేనందుకు మరో రూ. 1,500 చలాన్ విధించారు.
ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కారు యజమానితో వాగ్వాదం జరిగిన గందరగోళంలో పొరపాటున పీయూసీ చలాన్ జారీ చేశామని అంగీకరించారు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని, పొరపాటుగా వేసిన ఫైన్ను సిస్టం నుంచి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది.
వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లాలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఆపారు. కారు అద్దాలకు సన్షేడ్స్ ఉన్నాయని మొదట రూ. 200 జరిమానా విధించారు. ఆ తర్వాత పీయూసీ సర్టిఫికెట్ చూపించమని అడగ్గా, ఎలక్ట్రిక్ వాహనానికి అది అవసరం లేదని కారు యజమాని వాదించారు. అయినప్పటికీ అధికారి వినిపించుకోకుండా పీయూసీ లేనందుకు మరో రూ. 1,500 చలాన్ విధించారు.
ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కారు యజమానితో వాగ్వాదం జరిగిన గందరగోళంలో పొరపాటున పీయూసీ చలాన్ జారీ చేశామని అంగీకరించారు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని, పొరపాటుగా వేసిన ఫైన్ను సిస్టం నుంచి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది.