మహిళా రిజర్వేషన్ పై పవన్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై నటి ప్రీతి జింగానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం రాజకీయ ఉద్యమం కాదని, దేశానికి ఇదొక 'నాగరికతా ఉద్యమం' అని ఆమె అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం పరిపూర్ణం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆమె ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ, "సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం. 1996లో తొలిసారి ఈ బిల్లును ప్రవేశపెట్టారనుకుంటున్నాను. ఇన్నేళ్ల పోరాటం తర్వాత ఇది వాస్తవరూపం దాల్చడం కేవలం రాజకీయ పరిణామం కాదు, భారతదేశానికి ఇది ఒక నాగరికతా ఉద్యమం" అని ప్రీతి తెలిపారు. ప్రస్తుతం లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 15 శాతం మాత్రమే ఉందని, ఇది ఒక చేతిని వెనక్కి కట్టేసిన ప్రజాస్వామ్యంలా ఉందని ఆమె పోల్చారు.
"ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఆ కట్టిన చేయి తెరుచుకుంది. నిజమైన నిర్ణయాలు తీసుకునే ఈ టేబుల్ వద్దకు వచ్చి మీ స్థానాన్ని తీసుకోండని రాజ్యాంగమే మహిళలను ఆహ్వానిస్తోంది. ఈ బిల్లు కోసం పోరాడిన, మార్చ్ చేసిన, ఏళ్ల తరబడి ఎదురుచూసిన మహిళలందరికీ, తన తల్లిలాంటి ఎందరో మహిళలకు ఇది చాలా పెద్ద, చరిత్రాత్మక క్షణం" అని ప్రీతి వివరించారు.
ఈ బిల్లు సమాజంపై చూపే ప్రభావం గురించి మాట్లాడుతూ, "ఈ బిల్లు తీసుకురాబోయే మార్పుల ప్రభావం అపారంగా ఉంటుంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం కీలక స్థాయికి చేరినప్పుడు, దాని సానుకూల ప్రభావం ఊహించలేనంతగా ఉంటుంది" అని ప్రీతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశాల్లో అయితే మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందో, అక్కడ మహిళా సాధికారత కూడా మెరుగ్గా ఉందని ఆమె గుర్తుచేశారు. మన దేశంలో గ్రామ పంచాయతీల్లో కూడా మహిళలు అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిన ఉదాహరణలు ఉన్నాయని ప్రీతి జింగానియా పేర్కొన్నారు.
ప్రీతి జింగానియా గతంలో పవన్ కల్యాణ్ సరసన 'తమ్ముడు' చిత్రంలో నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టవడం తెలిసిందే.
ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ, "సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం. 1996లో తొలిసారి ఈ బిల్లును ప్రవేశపెట్టారనుకుంటున్నాను. ఇన్నేళ్ల పోరాటం తర్వాత ఇది వాస్తవరూపం దాల్చడం కేవలం రాజకీయ పరిణామం కాదు, భారతదేశానికి ఇది ఒక నాగరికతా ఉద్యమం" అని ప్రీతి తెలిపారు. ప్రస్తుతం లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 15 శాతం మాత్రమే ఉందని, ఇది ఒక చేతిని వెనక్కి కట్టేసిన ప్రజాస్వామ్యంలా ఉందని ఆమె పోల్చారు.
"ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఆ కట్టిన చేయి తెరుచుకుంది. నిజమైన నిర్ణయాలు తీసుకునే ఈ టేబుల్ వద్దకు వచ్చి మీ స్థానాన్ని తీసుకోండని రాజ్యాంగమే మహిళలను ఆహ్వానిస్తోంది. ఈ బిల్లు కోసం పోరాడిన, మార్చ్ చేసిన, ఏళ్ల తరబడి ఎదురుచూసిన మహిళలందరికీ, తన తల్లిలాంటి ఎందరో మహిళలకు ఇది చాలా పెద్ద, చరిత్రాత్మక క్షణం" అని ప్రీతి వివరించారు.
ఈ బిల్లు సమాజంపై చూపే ప్రభావం గురించి మాట్లాడుతూ, "ఈ బిల్లు తీసుకురాబోయే మార్పుల ప్రభావం అపారంగా ఉంటుంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం కీలక స్థాయికి చేరినప్పుడు, దాని సానుకూల ప్రభావం ఊహించలేనంతగా ఉంటుంది" అని ప్రీతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశాల్లో అయితే మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందో, అక్కడ మహిళా సాధికారత కూడా మెరుగ్గా ఉందని ఆమె గుర్తుచేశారు. మన దేశంలో గ్రామ పంచాయతీల్లో కూడా మహిళలు అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిన ఉదాహరణలు ఉన్నాయని ప్రీతి జింగానియా పేర్కొన్నారు.
ప్రీతి జింగానియా గతంలో పవన్ కల్యాణ్ సరసన 'తమ్ముడు' చిత్రంలో నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టవడం తెలిసిందే.