ఆలస్యంగా ప్రారంభమైన రాజస్థాన్-ముంబై మ్యాచ్... 11 ఓవర్లకు కుదింపు
రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. "మేము బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. వర్షం కారణంగా పిచ్ కవర్ల కింద ఉంది. ఇలాంటి వర్ష ప్రభావిత మ్యాచ్లలో ఛేజింగ్ చేయడం మంచిది. దీనివల్ల లక్ష్యంపై స్పష్టత ఉంటుంది. ఇది సీజన్ ఆరంభం మాత్రమే, తప్పులు జరగడం సహజం. వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం" అని తెలిపాడు. గాయం నుంచి కోలుకున్న తాను, ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు హార్దిక్ చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. "మేము కూడా టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. వర్షం వల్ల పిచ్లో తేమ ఉంది. అయితే 11 ఓవర్ల మ్యాచ్ కాబట్టి ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. గత మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించి బాగా ఆడాం. ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం" అని వివరించాడు.
రాజస్థాన్ రాయల్స్:
వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ.
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఏఎం ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. "మేము బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. వర్షం కారణంగా పిచ్ కవర్ల కింద ఉంది. ఇలాంటి వర్ష ప్రభావిత మ్యాచ్లలో ఛేజింగ్ చేయడం మంచిది. దీనివల్ల లక్ష్యంపై స్పష్టత ఉంటుంది. ఇది సీజన్ ఆరంభం మాత్రమే, తప్పులు జరగడం సహజం. వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం" అని తెలిపాడు. గాయం నుంచి కోలుకున్న తాను, ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు హార్దిక్ చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. "మేము కూడా టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. వర్షం వల్ల పిచ్లో తేమ ఉంది. అయితే 11 ఓవర్ల మ్యాచ్ కాబట్టి ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. గత మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించి బాగా ఆడాం. ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం" అని వివరించాడు.
రాజస్థాన్ రాయల్స్:
వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ.
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఏఎం ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.