Nagababu: వైసీపీ అధినేతతో పాటు నాయకులకు కూడా మతిపోయినట్టుంది: నాగబాబు

వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులు కూడా తమ కామన్ సెన్స్ (విచక్షణ) కోల్పోయాయని జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ మొత్తం ఒక 'పిచ్చి' జోన్‌లోకి ప్రవేశించిందని ఆయన ట్వీట్ చేశారు.

"రాజకీయాల్లో నేను గమనించిన ఒక సాధారణ విషయం ఏమిటంటే.. ఏదైనా పార్టీలో అగ్ర నాయకుడు దారి తప్పినా, విచక్షణ కోల్పోయినా.. రెండో శ్రేణి నాయకత్వం వెంటనే రంగంలోకి దిగి నష్టాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. పార్టీని, నాయకుడిని తిరిగి సరైన మార్గంలో పెట్టేందుకు కృషి చేస్తుంది. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ.

కానీ, వైసీపీ విషయంలో మాత్రం ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన పరిస్థితి నాకు కనిపిస్తోంది. ఇక్కడ పార్టీ అధినేత తన విచక్షణ, ఇంగిత జ్ఞానం పూర్తిగా కోల్పోయారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన్ను సరిదిద్దాల్సిన రెండో శ్రేణి నాయకత్వం, కింది స్థాయి కేడర్ కూడా తమ బుర్రలకు పనిచెప్పడం మానేశారు. నాయకుడు ఏం చేస్తే అదే కరెక్ట్ అన్నట్లుగా గుడ్డిగా అనుసరిస్తున్నారు.

దీని ఫలితంగా ‘మావిగన్’ (MAVIGAN) అని పిలుచుకునే ఈ మొత్తం పార్టీ ఒకరకమైన ఉన్మాద స్థితిలోకి (insanity zone) ప్రవేశించినట్లు అనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు చేస్తున్న వ్యాఖ్యలు, వారి ప్రవర్తనా శైలి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. ఒక వ్యవస్థలో అందరూ ఆలోచించడం మానేస్తే అది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనించాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను"  అని పేర్కొన్నారు.

Nagababu
YS Jagan
YSRCP
Janasena
Andhra Pradesh Politics
Political Criticism
Insanity Zone
Telugu News
Konidela Nagababu
AP Politics

More Telugu News