Andhra Pradesh: 28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర పటంలో మార్పులు చేసిన ప్రభుత్వం, రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ మ్యాప్లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పోలవరం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు, అభివృద్ధిని వికేంద్రీకరించే లక్ష్యంతోనే ఈ పునర్విభజన చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది.
గతంలో 13 జిల్లాలుగా ఉన్న ఏపీ, వైఎస్ జగన్ హయాంలో 26 జిల్లాలుగా మారింది. తాజాగా ఈ సంఖ్య 28కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, అధికారిక మ్యాప్లో అమరావతిని రాజధానిగా చేర్చడం ఈ ప్రకటనలో కీలక పరిణామం.
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పోలవరం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు, అభివృద్ధిని వికేంద్రీకరించే లక్ష్యంతోనే ఈ పునర్విభజన చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది.
గతంలో 13 జిల్లాలుగా ఉన్న ఏపీ, వైఎస్ జగన్ హయాంలో 26 జిల్లాలుగా మారింది. తాజాగా ఈ సంఖ్య 28కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, అధికారిక మ్యాప్లో అమరావతిని రాజధానిగా చేర్చడం ఈ ప్రకటనలో కీలక పరిణామం.