Iran: ఇరాన్ సైనిక శక్తి చెక్కుచెదరలేదు: అమెరికా నిఘా వర్గాల సంచలన నివేదిక
అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులు జరిపి నెల రోజులు దాటినా, ఇరాన్ సైనిక సామర్థ్యం ఇంకా గణనీయంగానే ఉందని అమెరికా నిఘా వర్గాల తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్కు చెందిన దాదాపు సగం క్షిపణి లాంచర్లు చెక్కుచెదరలేదని, వేలాది వన్-వే ఎటాక్ డ్రోన్లు ఇంకా వారి అమ్ములపొదిలో భద్రంగా ఉన్నాయని సీఎన్ఎన్ తన కథనంలో వెల్లడించింది.
"పశ్చిమాసియా అంతటా భారీ విధ్వంసం సృష్టించేందుకు ఇరాన్ ఇప్పటికీ పూర్తి సన్నద్ధంగా ఉంది" అని నిఘా నివేదిక గురించి తెలిసిన ఒక అధికారి అమెరికన్ మీడియాకు తెలిపారు. ఇరాన్ వద్ద ఇంకా పెద్ద సంఖ్యలో క్షిపణులు ఉన్నాయని, ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని నియంత్రించగల తీరప్రాంత రక్షణ క్రూయిజ్ క్షిపణులు గణనీయమైన సంఖ్యలో మిగిలి ఉన్నాయని ఈ అంచనాలు సూచిస్తున్నాయి.
దాడుల్లో ఇరాన్ నౌకాదళానికి చెందిన నౌకలు చాలా వరకు ధ్వంసమైనప్పటికీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన ప్రత్యేక నావికా దళాలు తమ సామర్థ్యంలో దాదాపు సగాన్ని నిలుపుకున్నట్లు సమాచారం. వారి వద్ద వందల, వేల సంఖ్యలో చిన్న పడవలు, మానవరహిత ఉపరితల నౌకలు ఉన్నాయని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. భూగర్భంలో విస్తృతమైన సొరంగాలు, గుహల నెట్వర్క్లో తన క్షిపణి లాంచర్లను దాచడం వల్లే ఇరాన్ ఈ నష్టం నుంచి తప్పించుకోగలిగిందని, వాటిని లక్ష్యంగా చేసుకోవడం కష్టంగా మారిందని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇరాన్పై సైనిక చర్యలను రెండు, మూడు వారాల్లో పూర్తి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే, నిఘా వర్గాల అంచనాలను బట్టి చూస్తే ఈ గడువు వాస్తవ దూరం అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నుంచి క్షిపణి, డ్రోన్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
"పశ్చిమాసియా అంతటా భారీ విధ్వంసం సృష్టించేందుకు ఇరాన్ ఇప్పటికీ పూర్తి సన్నద్ధంగా ఉంది" అని నిఘా నివేదిక గురించి తెలిసిన ఒక అధికారి అమెరికన్ మీడియాకు తెలిపారు. ఇరాన్ వద్ద ఇంకా పెద్ద సంఖ్యలో క్షిపణులు ఉన్నాయని, ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని నియంత్రించగల తీరప్రాంత రక్షణ క్రూయిజ్ క్షిపణులు గణనీయమైన సంఖ్యలో మిగిలి ఉన్నాయని ఈ అంచనాలు సూచిస్తున్నాయి.
దాడుల్లో ఇరాన్ నౌకాదళానికి చెందిన నౌకలు చాలా వరకు ధ్వంసమైనప్పటికీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన ప్రత్యేక నావికా దళాలు తమ సామర్థ్యంలో దాదాపు సగాన్ని నిలుపుకున్నట్లు సమాచారం. వారి వద్ద వందల, వేల సంఖ్యలో చిన్న పడవలు, మానవరహిత ఉపరితల నౌకలు ఉన్నాయని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. భూగర్భంలో విస్తృతమైన సొరంగాలు, గుహల నెట్వర్క్లో తన క్షిపణి లాంచర్లను దాచడం వల్లే ఇరాన్ ఈ నష్టం నుంచి తప్పించుకోగలిగిందని, వాటిని లక్ష్యంగా చేసుకోవడం కష్టంగా మారిందని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇరాన్పై సైనిక చర్యలను రెండు, మూడు వారాల్లో పూర్తి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే, నిఘా వర్గాల అంచనాలను బట్టి చూస్తే ఈ గడువు వాస్తవ దూరం అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నుంచి క్షిపణి, డ్రోన్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.