Nara Lokesh: ఓపికగా వినే నాయకుడు ఉండడం మన అదృష్టం: నారా లోకేశ్

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా తరగతుల్లో రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. ‘కాఫీ కబుర్లు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పార్టీ యూనిట్లను, బూత్‌లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. అందరం కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ఒక పటిష్టమైన వ్యవస్థలా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.

ప్రజల సమస్యలను ఓపికగా వినే గొప్ప నాయకుడు చంద్రబాబు గారు మనకు ఉండటం మనందరి అదృష్టమని లోకేశ్ అన్నారు. శిక్షణకు హాజరైన క్లస్టర్ ఇంఛార్జ్‌లను ఉద్దేశించి, "మీరంతా తెలుగుదేశం పార్టీకి కాబోయే భవిష్యత్ నాయకులు" అని పేర్కొంటూ వారిలో ఉత్సాహం నింపారు.
Nara Lokesh
Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Mangalagiri
Party Activists
Cluster Incharges
Political Training

More Telugu News