Ravindra Jadeja: సీఎస్కేతో బంధంపై జడేజా ఎమోషనల్... అది 'టు బి కంటిన్యూడ్' మాత్రమేనట!
ఐపీఎల్ 2026 సీజన్ను రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఘనంగా ప్రారంభించింది. సోమవారం గువాహటిలోని ఏసీఏ స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా, తన మాజీ జట్టుపై తొలిసారి ఆడటంపై భావోద్వేగంగా స్పందించాడు.
మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ... "రాజస్థాన్ పింక్ కలర్ నచ్చింది. పసుపు రంగు కొంచెం పాతదైపోయిందనిపిస్తోంది. అయితే, ఇది నేను సరదాగా అంటున్న మాట. నిజానికి 12-13 ఏళ్లు ఆడిన సీఎస్కే లాంటి ఫ్రాంచైజీని వీడటం మొదట్లో చాలా కష్టంగా, భావోద్వేగంగా అనిపించింది. కానీ, ప్రయాణంలో ఇలాంటి మార్పులు కూడా భాగమేనని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. నా ఐపీఎల్ కెరీర్లో తొలి టైటిల్ గెలిచిన జట్టులోకి మళ్లీ రావడం సంతోషంగా ఉంది" అని తెలిపాడు.
"అండర్-19 ప్రపంచకప్ తర్వాత నా ఐపీఎల్ ప్రస్థానం రాజస్థాన్తోనే మొదలైంది. తొలి సీజన్లోనే టైటిల్ గెలిచాం. ఆ జ్ఞాపకాలు నాతో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు అవే సానుకూల దృక్పథంతో కొత్త జట్టులో చేరాను. నా అనుభవాన్ని జట్టుతో పంచుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకోవడమే నా లక్ష్యం" అని జడేజా వివరించాడు.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 127 పరుగులకే కుప్పకూలింది. పిచ్ గురించి జడేజా మాట్లాడుతూ... "వికెట్ కాస్త స్టిక్కీగా ఉండటంతో నా బౌలింగ్కు బాగా అనుకూలించింది. ఇలాంటి పిచ్పై సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తే ఫలితం ఉంటుంది. తొలి మ్యాచ్లోనే ఇలాంటి వికెట్ దొరకడం బౌలర్గా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది" అని అన్నాడు.
కీలకమైన శివమ్ దూబే వికెట్ను తీసిన తర్వాత తన సెలబ్రేషన్ వెనుక ఉన్న కారణాన్ని కూడా జడేజా వెల్లడించాడు. "దూబే లాంటి బ్యాటర్ మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తాడు. అతను నన్ను సిక్స్ కొట్టిన తర్వాత నా వ్యూహం మార్చాను. వైడ్గా బౌలింగ్ చేస్తే టైమింగ్ దొరకదని భావించాను, అదే జరిగింది. నేను సీఎస్కేలో ఉన్నప్పుడు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకునేవాడిని. అందుకే ఇది ఒక 'టు బి కంటిన్యూడ్' మూమెంట్. ఆ సమయంలో దూబే వికెట్ తీయడం మా జట్టుకు చాలా కీలకం" అని జడేజా పేర్కొన్నాడు. జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్తో రాజస్థాన్ తమ సీజన్ను ఘన విజయంతో ఆరంభించింది.
మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ... "రాజస్థాన్ పింక్ కలర్ నచ్చింది. పసుపు రంగు కొంచెం పాతదైపోయిందనిపిస్తోంది. అయితే, ఇది నేను సరదాగా అంటున్న మాట. నిజానికి 12-13 ఏళ్లు ఆడిన సీఎస్కే లాంటి ఫ్రాంచైజీని వీడటం మొదట్లో చాలా కష్టంగా, భావోద్వేగంగా అనిపించింది. కానీ, ప్రయాణంలో ఇలాంటి మార్పులు కూడా భాగమేనని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. నా ఐపీఎల్ కెరీర్లో తొలి టైటిల్ గెలిచిన జట్టులోకి మళ్లీ రావడం సంతోషంగా ఉంది" అని తెలిపాడు.
"అండర్-19 ప్రపంచకప్ తర్వాత నా ఐపీఎల్ ప్రస్థానం రాజస్థాన్తోనే మొదలైంది. తొలి సీజన్లోనే టైటిల్ గెలిచాం. ఆ జ్ఞాపకాలు నాతో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు అవే సానుకూల దృక్పథంతో కొత్త జట్టులో చేరాను. నా అనుభవాన్ని జట్టుతో పంచుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకోవడమే నా లక్ష్యం" అని జడేజా వివరించాడు.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 127 పరుగులకే కుప్పకూలింది. పిచ్ గురించి జడేజా మాట్లాడుతూ... "వికెట్ కాస్త స్టిక్కీగా ఉండటంతో నా బౌలింగ్కు బాగా అనుకూలించింది. ఇలాంటి పిచ్పై సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తే ఫలితం ఉంటుంది. తొలి మ్యాచ్లోనే ఇలాంటి వికెట్ దొరకడం బౌలర్గా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది" అని అన్నాడు.
కీలకమైన శివమ్ దూబే వికెట్ను తీసిన తర్వాత తన సెలబ్రేషన్ వెనుక ఉన్న కారణాన్ని కూడా జడేజా వెల్లడించాడు. "దూబే లాంటి బ్యాటర్ మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తాడు. అతను నన్ను సిక్స్ కొట్టిన తర్వాత నా వ్యూహం మార్చాను. వైడ్గా బౌలింగ్ చేస్తే టైమింగ్ దొరకదని భావించాను, అదే జరిగింది. నేను సీఎస్కేలో ఉన్నప్పుడు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకునేవాడిని. అందుకే ఇది ఒక 'టు బి కంటిన్యూడ్' మూమెంట్. ఆ సమయంలో దూబే వికెట్ తీయడం మా జట్టుకు చాలా కీలకం" అని జడేజా పేర్కొన్నాడు. జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్తో రాజస్థాన్ తమ సీజన్ను ఘన విజయంతో ఆరంభించింది.