Goods Train: ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మూడు మార్గాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం

విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ట్యాంకర్ గూడ్స్ రైలు కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రెండు ట్యాంకర్ వ్యాగన్లు బోల్తా పడటంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


బోల్తా పడిన ట్యాంకర్ వ్యాగన్లను ట్రాక్ నుంచి తొలగించి, పట్టాలను యథాస్థితికి తీసుకురావడానికి సుమారు 200 మంది రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. భారీ క్రేన్ల సహాయంతో వ్యాగన్లను పక్కకు తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ట్రాక్ దెబ్బతినడంతో మరమ్మతులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


ఈ ప్రమాదం కారణంగా ప్రధానంగా మూడు మార్గాల్లో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది:

  • విజయవాడ – తిరుపతి

  • విజయవాడ – చెన్నై

  • కొమ్మరపూడి జంక్షన్ – కృష్ణపట్నం


ఈ మార్గాల్లో నడవాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో స్టేషన్లలో వేచి ఉన్న ప్రయాణికులకు తాగునీరు, ఇతర సౌకర్యాల విషయంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని రైల్వే వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. వీలైనంత త్వరగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

Goods Train
Andhra Pradesh
Train derailment
Vijayawada
Tirupati
Chennai
Kommarapudi
Krishna Patnam
Indian Railways

More Telugu News