Jagan Mohan Reddy: చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్
వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. పాలనలో అంతా తనదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతి చిన్న విషయంలో 'క్రెడిట్ చోరీ' చేస్తున్నారని మండిపడ్డారు.
నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుండటం పార్టీకి మంచి పరిణామమని జగన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని, గతంలో తాము పదవులు, కాంట్రాక్టుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు చట్టసభల్లో కూడా మన మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.