తెలంగాణలో మాంసాహారం జోరు.. పదేళ్లలో 5 రెట్లు పెరిగిన మాంసం వినియోగం

తెలంగాణ గడ్డపై మాంసాహార ప్రియుల జోరు ఏ స్థాయిలో ఉందో తాజా ఆర్థిక సర్వే కళ్లకు కట్టింది. గత పదేళ్లలో రాష్ట్రంలో మాంసం వినియోగం ఊహించని రీతిలో 5 రెట్లు పెరగడం గమనార్హం. కేవలం తిండిలోనే కాదు, పశుసంపద ఉత్పత్తిలోనూ తెలంగాణ దేశవ్యాప్తంగా తన జెండాను పాతేస్తోంది.


తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ - 2026 సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2013-14లో కేవలం 2.30 లక్షల టన్నులుగా ఉన్న మాంసం వినియోగం... 2024-25 నాటికి ఏకంగా 11.01 లక్షల టన్నులకు చేరుకుంది. గొర్రెల పెంపకంలో కూడా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. పౌల్ట్రీ రంగంలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.


కేవలం మాంసమే కాదు, అనుబంధ రంగాల్లో కూడా తెలంగాణ వృద్ధి అద్భుతంగా ఉంది. పదేళ్ల క్రితం 1,006 కోట్లుగా ఉన్న గుడ్ల వినియోగం, ఇప్పుడు 1,935.26 కోట్లకు పెరిగింది. అంటే సగటున ప్రతి ఒక్కరి ఆహారంలో గుడ్ల వాటా రెట్టింపు అయ్యింది.



More Telugu News