Adivi Sesh: 'డెకాయిట్' కోసం ప్రతి సీన్ రెండుసార్లు చిత్రీకరణ... ఎందుకో చెప్పిన అడవి శేష్
విలక్షణ నటుడు, రచయిత అడివి శేష్ తన రాబోయే చిత్రం 'డెకాయిట్' ప్రమోషన్లలో భాగంగా ద్విభాషా చిత్రాల చిత్రీకరణలో ఎదురయ్యే సవాళ్లు, అనుభవాలను పంచుకున్నారు. తాను, దర్శకుడు షానీల్ డియో కలిసి ఈ సినిమాకు కథ రాశామని, షూటింగ్ సమయంలో తమ మధ్య అద్భుతమైన స్వేచ్ఛ ఉండేదని ఆయన తెలిపారు. తాజాగా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేష్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ద్విభాషా చిత్రాల రూపకల్పన గురించి శేష్ వివరిస్తూ, "సెట్స్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేని నిజాయతీ ఉండేది. ఒక షాట్ నాకు నచ్చకపోయినా, ఆయనకు నచ్చకపోయినా ముఖం మీదే చెప్పేసుకునేంత స్వేచ్ఛ మాకుంది. వృత్తిపరమైన అడ్డంకులు ఏవీ లేకపోవడం మాకు కలిసొచ్చింది. దీన్నే నిజమైన భాగస్వామ్యం అంటారు. దర్శకుడు షానీల్ మాతృభాష హిందీ కాగా, నేను తెలుగు వాడిని. దీంతో రెండు భాషల్లోని నేటివిటీ, భావోద్వేగాలు సరిగ్గా పండేలా చూసుకునే బాధ్యతను పంచుకున్నాం" అని తెలిపారు.
షూటింగ్ ప్రక్రియను వివరిస్తూ, "దర్శకుడిగా షానీల్ ముందుగా సీన్ యొక్క మూడ్ను సరిగ్గా సెట్ చేసుకోవడానికి హిందీలో చిత్రీకరించేవారు. ఆ తర్వాత, తెలుగు నేటివిటీకి అనుగుణంగా నేను ఆ సీన్ను మార్పులు చేసి నటించేవాడిని. ఆయన అనుకున్న విధంగానే సీన్ వచ్చిందో లేదో సరిచూసుకునేవాళ్లం. ఇలా ప్రతీ సీన్ను, ప్రతీ డైలాగ్ను, ప్రతీ టేక్ను హిందీకి వేరుగా, తెలుగుకు వేరుగా చిత్రీకరించాం. కొన్నిసార్లు రెండు భాషల్లో స్క్రిప్ట్లను కూడా విభిన్నంగా ట్రీట్ చేశాం. ఉదాహరణకు, తెలుగులో ఒక పంచ్ డైలాగ్ సీన్ ప్రారంభంలో ఉంటే, హిందీలో అదే డైలాగ్ సీన్ చివరిలో లేదా తర్వాతి సీన్లో ఉండొచ్చు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ మార్పులు చేశాం" అని అడివి శేష్ చెప్పుకొచ్చారు.
సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న 'డెకాయిట్' చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ద్విభాషా చిత్రాల రూపకల్పన గురించి శేష్ వివరిస్తూ, "సెట్స్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేని నిజాయతీ ఉండేది. ఒక షాట్ నాకు నచ్చకపోయినా, ఆయనకు నచ్చకపోయినా ముఖం మీదే చెప్పేసుకునేంత స్వేచ్ఛ మాకుంది. వృత్తిపరమైన అడ్డంకులు ఏవీ లేకపోవడం మాకు కలిసొచ్చింది. దీన్నే నిజమైన భాగస్వామ్యం అంటారు. దర్శకుడు షానీల్ మాతృభాష హిందీ కాగా, నేను తెలుగు వాడిని. దీంతో రెండు భాషల్లోని నేటివిటీ, భావోద్వేగాలు సరిగ్గా పండేలా చూసుకునే బాధ్యతను పంచుకున్నాం" అని తెలిపారు.
షూటింగ్ ప్రక్రియను వివరిస్తూ, "దర్శకుడిగా షానీల్ ముందుగా సీన్ యొక్క మూడ్ను సరిగ్గా సెట్ చేసుకోవడానికి హిందీలో చిత్రీకరించేవారు. ఆ తర్వాత, తెలుగు నేటివిటీకి అనుగుణంగా నేను ఆ సీన్ను మార్పులు చేసి నటించేవాడిని. ఆయన అనుకున్న విధంగానే సీన్ వచ్చిందో లేదో సరిచూసుకునేవాళ్లం. ఇలా ప్రతీ సీన్ను, ప్రతీ డైలాగ్ను, ప్రతీ టేక్ను హిందీకి వేరుగా, తెలుగుకు వేరుగా చిత్రీకరించాం. కొన్నిసార్లు రెండు భాషల్లో స్క్రిప్ట్లను కూడా విభిన్నంగా ట్రీట్ చేశాం. ఉదాహరణకు, తెలుగులో ఒక పంచ్ డైలాగ్ సీన్ ప్రారంభంలో ఉంటే, హిందీలో అదే డైలాగ్ సీన్ చివరిలో లేదా తర్వాతి సీన్లో ఉండొచ్చు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ మార్పులు చేశాం" అని అడివి శేష్ చెప్పుకొచ్చారు.
సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న 'డెకాయిట్' చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.