రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తన రాజకీయ రంగప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతనిచ్చారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడి కుమారుడిగా, లోకేశ్ కు సోదరుడిగా రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ... రోహిత్ ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, "కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. కానీ దానికి ఇంకా సమయం ఉంది. సరైన సమయంలో నా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను" అని తెలిపారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించడమే తన మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు.


More Telugu News