శ్రీలంక వెళుతున్నారా?... ఇకపై ఫోన్తోనే సులభంగా చెల్లించవచ్చు!
పొరుగు దేశమైన శ్రీలంకకు వెళ్లే భారతీయ పర్యాటకులకు చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి. శ్రీలంక వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల అంగీకారాన్ని బలోపేతం చేస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగమైన ఎన్ఐపీఎల్ మంగళవారం ప్రకటించింది. ఈ చొరవతో భారత పర్యాటకులు నగదుపై ఆధారపడకుండా తమ స్మార్ట్ఫోన్లతోనే డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు కలుగుతుంది. శ్రీలంక డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.
శ్రీలంక పర్యాటక రంగానికి భారత్ అతిపెద్ద వనరుగా ఉంది. 2024లో 4.16 లక్షల మంది భారతీయులు శ్రీలంకను సందర్శించగా, 2025 నాటికి ఆ సంఖ్య 5.31 లక్షలకు పెరిగింది. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సులభమైన, నమ్మకమైన చెల్లింపు పరిష్కారాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ఐపీఎల్, శ్రీలంకకు చెందిన 'లంకాపే'తో కలిసి పనిచేస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం భారత పర్యాటకులు తమ యూపీఐ ఆధారిత యాప్ల ద్వారా అక్కడి ‘లంకా క్యూఆర్’ కోడ్లను స్కాన్ చేసి నేరుగా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం ప్రధాన హోటళ్లు, రిటైల్ దుకాణాలు, సూపర్ మార్కెట్ల వద్ద ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త విధానం వల్ల పర్యాటకులతో పాటు శ్రీలంక వ్యాపారులకూ ప్రయోజనం చేకూరనుంది. పర్యాటకులకు రియల్ టైమ్ చెల్లింపులు, పారదర్శకమైన మారకం రేట్లు, సుపరిచితమైన పేమెంట్ విధానం అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో శ్రీలంక వ్యాపారులు భారత్కు చెందిన విశాలమైన డిజిటల్ కస్టమర్ బేస్ను ఆకర్షించడంతో పాటు నగదు నిర్వహణ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ సందర్భంగా ఎన్ఐపీఎల్ ఎండీ, సీఈఓ రితేశ్ శుక్లా మాట్లాడుతూ.. "సరిహద్దు లావాదేవీలను సులభతరం చేయడం, దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాం. పర్యాటకం, ఆతిథ్యం, రిటైల్ వంటి కీలక రంగాల్లో యూపీఐ అంగీకారాన్ని పెంచి, వ్యాపారులకు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందిస్తాం" అని తెలిపారు.
భారత్ అభివృద్ధి చేసిన యూపీఐ వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్గా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇన్స్టంట్ చెల్లింపుల్లో దాదాపు 50శాతం వాటా యూపీఐదే కావడం విశేషం. ఈ తాజా చొరవ భారత్, శ్రీలంక మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
శ్రీలంక పర్యాటక రంగానికి భారత్ అతిపెద్ద వనరుగా ఉంది. 2024లో 4.16 లక్షల మంది భారతీయులు శ్రీలంకను సందర్శించగా, 2025 నాటికి ఆ సంఖ్య 5.31 లక్షలకు పెరిగింది. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సులభమైన, నమ్మకమైన చెల్లింపు పరిష్కారాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ఐపీఎల్, శ్రీలంకకు చెందిన 'లంకాపే'తో కలిసి పనిచేస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం భారత పర్యాటకులు తమ యూపీఐ ఆధారిత యాప్ల ద్వారా అక్కడి ‘లంకా క్యూఆర్’ కోడ్లను స్కాన్ చేసి నేరుగా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం ప్రధాన హోటళ్లు, రిటైల్ దుకాణాలు, సూపర్ మార్కెట్ల వద్ద ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త విధానం వల్ల పర్యాటకులతో పాటు శ్రీలంక వ్యాపారులకూ ప్రయోజనం చేకూరనుంది. పర్యాటకులకు రియల్ టైమ్ చెల్లింపులు, పారదర్శకమైన మారకం రేట్లు, సుపరిచితమైన పేమెంట్ విధానం అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో శ్రీలంక వ్యాపారులు భారత్కు చెందిన విశాలమైన డిజిటల్ కస్టమర్ బేస్ను ఆకర్షించడంతో పాటు నగదు నిర్వహణ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ సందర్భంగా ఎన్ఐపీఎల్ ఎండీ, సీఈఓ రితేశ్ శుక్లా మాట్లాడుతూ.. "సరిహద్దు లావాదేవీలను సులభతరం చేయడం, దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాం. పర్యాటకం, ఆతిథ్యం, రిటైల్ వంటి కీలక రంగాల్లో యూపీఐ అంగీకారాన్ని పెంచి, వ్యాపారులకు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందిస్తాం" అని తెలిపారు.
భారత్ అభివృద్ధి చేసిన యూపీఐ వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్గా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇన్స్టంట్ చెల్లింపుల్లో దాదాపు 50శాతం వాటా యూపీఐదే కావడం విశేషం. ఈ తాజా చొరవ భారత్, శ్రీలంక మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.