కొత్తింట్లో చేరిన 'దంగల్' నటి

'దంగల్', 'మిసెస్' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి సాన్యా మల్హోత్రా తన సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. ముంబైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో ఆమె శనివారం గృహప్రవేశ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.

ఈ పూజా కార్యక్రమాల్లో సాన్యా గులాబీ రంగు చీరలో, వెండి ఆభరణాలతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఆమె తల్లిదండ్రులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాన్యా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "సంవత్సరాల కలలు, కృషి, ఎదుగుదల ఫలితమే ఈ ఇల్లు. ఓర్పు, నమ్మకం యొక్క ఫలం ఎంత అందంగా ఉంటుందో ఈ ఇంటి ప్రతీ గోడ నాకు గుర్తుచేస్తుంది. నా ఈ ప్రయాణంలో నా కుటుంబం, స్నేహితుల నమ్మకమే నాకు అతిపెద్ద బలం. ఇది కేవలం ఇల్లు కాదు, నా ప్రయాణంలో ఒక చిన్న భాగం" అని ఆమె పేర్కొన్నారు.

ఇక సాన్యా సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బందర్' చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె తొలిసారిగా నటుడు బాబీ డియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా 2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు, రాజ్‌కుమార్ రావు సరసన 'టోస్టర్' అనే మరో కామెడీ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు.


More Telugu News