ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. రేపటి నుంచి బెంగళూరులో రెస్టారెంట్ల మూసివేత!

  • నగరవ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లను మూసివేయక తప్పదంటున్న అసోసియేషన్ 
  • కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటళ్లను నిర్వహించలేమని వెల్లడి
  • గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని వెల్లడి
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బెంగళూరులోని రెస్టారెంట్లపై తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా హఠాత్తుగా నిలిచిపోయిందని, దీంతో రేపటి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ఆ ప్రకటనలో తెలిపింది.

గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది.

Bangalore Restaurants
Iran Israel War
LPG Cylinder Shortage
Bangalore Hotels Association
Restaurant Closures

More Telugu News