ఢిల్లీ కేసులో క్లీన్చిట్.. తిరుమల యాత్రకు సిద్ధమైన కల్వకుంట్ల కవిత
- 5న అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి
- 6న తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుల చెల్లింపు
- తిరుమల పర్యటన తర్వాత రాజకీయ భవిష్యత్పై ప్రకటన చేసే అవకాశం
- రెండు నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ఇప్పటికే ప్రకటన
ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కేసు నుంచి విముక్తి లభించడంతో స్వామివారికి మొక్కు చెల్లించుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాలినడకన అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల కొండకు చేరుకోవాలని సంకల్పించారు.
ఆమె పర్యటన వివరాలను సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీన కవిత తిరుపతికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి వెళ్లనున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి, ఆ మరుసటి రోజు అంటే 6వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఆమె హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సీబీఐ సరైన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మంది నిందితులను ఈ కేసు నుంచి విముక్తుల్ని చేసింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని నిందితులు ఆరోపించారు. కాగా, ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న కవిత దాదాపు 6 నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు.
అయితే, కవిత తిరుమల పర్యటన కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకే పరిమితం కాదని, దీని వెనుక రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రానున్న రెండు నెలల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లో చురుగ్గా ఉంటున్న ఆమె, ఈ పర్యటన తర్వాత తన రాజకీయ కార్యాచరణను మరింత వేగవంతం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆమె పర్యటన వివరాలను సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీన కవిత తిరుపతికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి వెళ్లనున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి, ఆ మరుసటి రోజు అంటే 6వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఆమె హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సీబీఐ సరైన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మంది నిందితులను ఈ కేసు నుంచి విముక్తుల్ని చేసింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని నిందితులు ఆరోపించారు. కాగా, ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న కవిత దాదాపు 6 నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు.
అయితే, కవిత తిరుమల పర్యటన కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకే పరిమితం కాదని, దీని వెనుక రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రానున్న రెండు నెలల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లో చురుగ్గా ఉంటున్న ఆమె, ఈ పర్యటన తర్వాత తన రాజకీయ కార్యాచరణను మరింత వేగవంతం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.