సూర్య ప్రశంసలకు సంజూ భావోద్వేగం.. 'ఏడిపిస్తావా ఏంటి?' అంటూ హత్తుకున్న వైనం!
- విండీస్పై విజయంతో టీ20 వరల్డ్ కప్ సెమీస్లోకి భారత్
- 50 బంతుల్లో 97 పరుగులు చేసి హీరోగా నిలిచిన సంజూ శాంసన్
- సంజూను ప్రశంసించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
- 'ఏడిపిస్తావా ఏంటి?' అంటూ సూర్యను హత్తుకున్న శాంసన్
- సంజూ ఇన్నింగ్స్ ఓ ధైర్యవంతమైన ప్రదర్శన అని కొనియాడిన కెప్టెన్
టీ20 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్పై అద్భుత విజయం సాధించి సెమీఫైనల్కు అర్హత సాధించిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్రూమ్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్లో హీరోగా నిలిచిన సంజూ శాంసన్ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలతో ముంచెత్తగా, సంజూ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.
నిన్న జరిగిన ఈ కీలక మ్యాచ్లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. లక్ష్య ఛేదనలో కేవలం 50 బంతుల్లో 97 పరుగులు చేసిన సంజూ శాంసన్, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్, సంజూ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించాడు. ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోసం ఇబ్బంది పడిన తర్వాత ఇలాంటి ఇన్నింగ్స్తో తిరిగి రావడం గొప్ప విషయమని కొనియాడాడు. కెప్టెన్ మాటలకు భావోద్వేగానికి గురైన సంజూ.. సూర్యకుమార్ను ఆప్యాయంగా హత్తుకుని "రులాయేగా క్యా? (నన్ను ఏడిపిస్తావా ఏంటి?)" అని సరదాగా అనడంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ, సంజూ జట్టు పట్ల చూపిన నిబద్ధతను గుర్తుచేసుకున్నాడు. "మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది, అది కూడా సరైన సమయంలో జరుగుతుంది. జట్టుకు అవసరమైన సమయంలో సంజూ నిలబడ్డాడు. తను జట్టులోకి తిరిగి వచ్చినప్పుడు మాతో చెప్పిన మొదటి మాట.. 'మనకు ఏం కావాలో కాదు, జట్టుకు ఏం కావాలో అదే చేద్దాం' అని. ఇది అతని నిస్వార్థానికి నిదర్శనం" అని సూర్య వివరించాడు.
"సంజూ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశాడు. జట్టులో స్థానం కోల్పోవడం, వేరే బ్యాటింగ్ పొజిషన్లో ఆడటం వంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయినా పట్టుదలతో తిరిగి అదే స్థానంలో రాణించాడు. ప్రపంచకప్లు గెలవడం అంత సులభం కాదు. ఐసీసీ టోర్నీల్లో ధైర్యవంతులే మ్యాచ్లు గెలిపిస్తారు. సంజూ ఆడింది అలాంటి ధైర్యమైన ఇన్నింగ్స్. ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ఒక ఎండ్లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది" అని సూర్యకుమార్ ప్రశంసలు కురిపించాడు.
నిన్న జరిగిన ఈ కీలక మ్యాచ్లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. లక్ష్య ఛేదనలో కేవలం 50 బంతుల్లో 97 పరుగులు చేసిన సంజూ శాంసన్, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్, సంజూ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించాడు. ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోసం ఇబ్బంది పడిన తర్వాత ఇలాంటి ఇన్నింగ్స్తో తిరిగి రావడం గొప్ప విషయమని కొనియాడాడు. కెప్టెన్ మాటలకు భావోద్వేగానికి గురైన సంజూ.. సూర్యకుమార్ను ఆప్యాయంగా హత్తుకుని "రులాయేగా క్యా? (నన్ను ఏడిపిస్తావా ఏంటి?)" అని సరదాగా అనడంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ, సంజూ జట్టు పట్ల చూపిన నిబద్ధతను గుర్తుచేసుకున్నాడు. "మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది, అది కూడా సరైన సమయంలో జరుగుతుంది. జట్టుకు అవసరమైన సమయంలో సంజూ నిలబడ్డాడు. తను జట్టులోకి తిరిగి వచ్చినప్పుడు మాతో చెప్పిన మొదటి మాట.. 'మనకు ఏం కావాలో కాదు, జట్టుకు ఏం కావాలో అదే చేద్దాం' అని. ఇది అతని నిస్వార్థానికి నిదర్శనం" అని సూర్య వివరించాడు.
"సంజూ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశాడు. జట్టులో స్థానం కోల్పోవడం, వేరే బ్యాటింగ్ పొజిషన్లో ఆడటం వంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయినా పట్టుదలతో తిరిగి అదే స్థానంలో రాణించాడు. ప్రపంచకప్లు గెలవడం అంత సులభం కాదు. ఐసీసీ టోర్నీల్లో ధైర్యవంతులే మ్యాచ్లు గెలిపిస్తారు. సంజూ ఆడింది అలాంటి ధైర్యమైన ఇన్నింగ్స్. ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ఒక ఎండ్లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది" అని సూర్యకుమార్ ప్రశంసలు కురిపించాడు.