నేడు విజయనిర్మల జయంతి... నరేశ్ ఎమోషనల్ ట్వీట్
- అమ్మను తలచుకుని నరేశ్ భావోద్వేగం.. ఎమోషనల్ పోస్ట్
- ఆమె ప్రేమ తన బలం, మౌనం మార్గదర్శకం అని వ్యాఖ్య
- కళాకారిణిగా చరిత్ర సృష్టించి, తల్లిగా జీవితానికి అర్థాన్నిచ్చారని వెల్లడి
- ఆమె ఆత్మ తనతోనే నడుస్తుందని ఉద్వేగభరిత వ్యాఖ్యలు
దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్భంగా ఆమె కుమారుడు, ప్రముఖ నటుడు నరేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. తన జీవితంలో అమ్మ ప్రభావం ఎలాంటిదో వివరిస్తూ ఆయన రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి.
"అమ్మ, కళావాహిని డా. విజయనిర్మల గారి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నాను. ఆమె ప్రేమ నా బలం, ఆమె మౌనం నాకు మార్గదర్శకం, ఆమె జీవితం ఒక నిశ్శబ్ద ఆశీర్వాదం. ఆమె ఆత్మీయత నా ప్రతి క్షణాన్ని తీర్చిదిద్దింది. ఆమె విలువలు నా ప్రతి అడుగుకు రూపం కల్పించాయి. ఆమె ఆత్మ కాలానికి, మాటలకు అతీతంగా నాతోనే నడుస్తూ ఉంటుంది" అని నరేశ్ పేర్కొన్నారు.స
"ఒక కళాకారిణిగా, దర్శకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఒక తల్లిగా నా జీవితానికి అర్థాన్నిచ్చారు. ఆమె ప్రేమ, ఆశీస్సులు, ఉనికి నా హృదయంలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి" అంటూ తన తల్లిపై ఉన్న అపారమైన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. నరేశ్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
"అమ్మ, కళావాహిని డా. విజయనిర్మల గారి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నాను. ఆమె ప్రేమ నా బలం, ఆమె మౌనం నాకు మార్గదర్శకం, ఆమె జీవితం ఒక నిశ్శబ్ద ఆశీర్వాదం. ఆమె ఆత్మీయత నా ప్రతి క్షణాన్ని తీర్చిదిద్దింది. ఆమె విలువలు నా ప్రతి అడుగుకు రూపం కల్పించాయి. ఆమె ఆత్మ కాలానికి, మాటలకు అతీతంగా నాతోనే నడుస్తూ ఉంటుంది" అని నరేశ్ పేర్కొన్నారు.స
"ఒక కళాకారిణిగా, దర్శకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఒక తల్లిగా నా జీవితానికి అర్థాన్నిచ్చారు. ఆమె ప్రేమ, ఆశీస్సులు, ఉనికి నా హృదయంలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి" అంటూ తన తల్లిపై ఉన్న అపారమైన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. నరేశ్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.