Tarique Rahman: బంగ్లాదేశ్‌లో సంచలనం.. ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న ముగ్గురు నేతలు ఎంపీలుగా గెలుపు!

Tarique Rahman Victory Three Leaders with Death Sentences Win Bangladesh Election
షార్ట్స్‌లో చూడండి
పొరుగు దేశం బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాల తర్వాత తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల్లో ఒకప్పుడు ఉరిశిక్ష పడి, ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైన ముగ్గురు వివాదాస్పద నేతలు ఎంపీలుగా గెలవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

బీఎన్‌పీకి చెందిన లుత్ఫుజ్జమాన్ బాబర్, అబ్దుస్ సలాం పింటూ, జమాత్-ఎ-ఇస్లామీ నేత ఏటీఎం అజహరుల్ ఇస్లాం తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీలతో గెలుపొందారు. 2004లో అప్పటి ప్రధాని షేక్ హసీనా లక్ష్యంగా జరిగిన గ్రెనేడ్ దాడి కేసులో బాబర్, పింటూలకు మరణశిక్ష పడగా, 1971 విమోచన యుద్ధ సమయంలో 1200 మంది బంగ్లాదేశీయుల మరణాలకు కారణమయ్యాడన్న   ఆరోపణలు ఎదుర్కొన్న అజహరుల్ ఇస్లాంకు కూడా ఉరిశిక్ష విధించారు.

అయితే, 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం ప్రజాందోళనలతో కూలిపోయిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన న్యాయ ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టులు వేర్వేరు కేసుల్లో వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పులిచ్చాయి. దీంతో వీరు ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలు అంత సజావుగా లేవని భావిస్తున్న న్యూఢిల్లీ తారిఖ్ రెహ్మాన్ కొత్త ప్రభుత్వంపై 'ఆచితూచి ఆశాభావంతో' ఉన్నట్లు సంకేతాలిచ్చింది. ప్రధాని మోదీ ఇప్పటికే తారిఖ్ రెహ్మాన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Go Back to Shorts
Tarique Rahman
Bangladesh election
BNP
Lutfuzzaman Babar
Abdus Salam Pintu
ATM Azharul Islam
Sheikh Hasina
Mohammad Yunus
Bangladesh Nationalist Party
Bangladesh politics

More Telugu News