టీ20 వరల్డ్ కప్.. నమీబియాపై టాస్ ఓడిన టీమిండియా
- టీ20 ప్రపంచకప్లో భారత్తో నమీబియా పోరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నమీబియా
- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో భాగంగా గురువారం నమీబియాతో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈరోజు రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో ఇది 18వ మ్యాచ్. కెప్టెన్ సూర్యకుమార్తో పాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. మరోవైపు పసికూన నమీబియా జట్టుకు గెర్హార్డ్ ఎరాస్మస్ సారథ్యం వహిస్తున్నాడు.
కాగితంపై భారత జట్టు చాలా బలంగా ఉన్నప్పటికీ, టీ20 ఫార్మాట్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరికాసేపట్లో భారత ఓపెనర్లు క్రీజులోకి అడుగుపెట్టనున్నారు. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీలో ముందుకు సాగాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
టాస్ గెలిచిన అనంతరం నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ మాట్లాడుతూ.. "ఇది అద్భుతమైన ఫ్లాట్ వికెట్. గణాంకాలు, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ చేయడమే సరైన నిర్ణయమని భావిస్తున్నాం. ఛేదనలో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాం" అని తెలిపాడు. భారత్లో ఇంత మంది అభిమానుల మధ్య ఆడటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
మరోవైపు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామని, టాస్ ఓడినా సంతోషంగానే ఉన్నామని చెప్పాడు. "టాస్లు ఓడినా మ్యాచ్లు గెలుస్తున్నంత వరకు మాకు ఫర్వాలేదు. ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది" అని వివరించాడు.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయపడిన అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం లభించింది. అదేవిధంగా, పేసర్ మహమ్మద్ సిరాజ్కు విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తుది జట్టులోకి తీసుకున్నారు. నమీబియా కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసింది.
ఈరోజు రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో ఇది 18వ మ్యాచ్. కెప్టెన్ సూర్యకుమార్తో పాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. మరోవైపు పసికూన నమీబియా జట్టుకు గెర్హార్డ్ ఎరాస్మస్ సారథ్యం వహిస్తున్నాడు.
కాగితంపై భారత జట్టు చాలా బలంగా ఉన్నప్పటికీ, టీ20 ఫార్మాట్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరికాసేపట్లో భారత ఓపెనర్లు క్రీజులోకి అడుగుపెట్టనున్నారు. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీలో ముందుకు సాగాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
టాస్ గెలిచిన అనంతరం నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ మాట్లాడుతూ.. "ఇది అద్భుతమైన ఫ్లాట్ వికెట్. గణాంకాలు, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ చేయడమే సరైన నిర్ణయమని భావిస్తున్నాం. ఛేదనలో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాం" అని తెలిపాడు. భారత్లో ఇంత మంది అభిమానుల మధ్య ఆడటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
మరోవైపు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామని, టాస్ ఓడినా సంతోషంగానే ఉన్నామని చెప్పాడు. "టాస్లు ఓడినా మ్యాచ్లు గెలుస్తున్నంత వరకు మాకు ఫర్వాలేదు. ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది" అని వివరించాడు.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయపడిన అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం లభించింది. అదేవిధంగా, పేసర్ మహమ్మద్ సిరాజ్కు విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తుది జట్టులోకి తీసుకున్నారు. నమీబియా కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసింది.
భారత్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
నమీబియా
గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్, జేజే స్మిత్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో.