Max Hingo: టీమిండియా మాపై 250 కొట్టే ప్రశ్నే లేదు: నమీబియా యువ ఫాస్ట్ బౌలర్ ధీమా

Max Hingo Confident Namibia Will Restrict India to 180 Runs
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు గురువారం నాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో ఆఫ్రికా పసికూన నమీబియా తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేస్తామని నమీబియా 18 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ మాక్స్ హీంగో ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నప్పటికీ, తమ బౌలింగ్‌తో వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగలమని అన్నాడు.

"భారత్ మాపై 250 పరుగులకు పైగా స్కోర్ చేసే ప్రసక్తే లేదు. బహుశా వారు 180 పరుగులు చేయొచ్చు. కానీ, 300 పరుగులు మాత్రం అస్సలు చేయలేరు" అని మ్యాచ్‌కు ముందు ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హీంగో పేర్కొన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో నమీబియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

భారత్‌లో, వారి సొంత ప్రేక్షకుల మధ్య ఆడటంపై హీంగో స్పందిస్తూ.. "50 వేల మంది ప్రేక్షకుల మధ్య ఆడటం ఒత్తిడితో కూడుకున్నప్పటికీ, ఇది ఒక అద్భుతమైన అనుభూతి. నాలో కంగారు ఉన్నా, నా నైపుణ్యాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాను. నా సహచరులు నాకు ధైర్యం చెబుతున్నారు" అని తెలిపాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఒక్క క్యాచ్ డ్రాప్ కారణంగా ఓడిపోయామని, ఇది తమను నిరాశపరిచిందని అన్నాడు.

భారత్‌కు 2011 వన్డే ప్రపంచకప్ అందించిన గ్యారీ కిర్‌స్టెన్ తమ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా ఉండటం ఎంతో మేలు చేస్తోందని, ఆయన అనుభవం జట్టుకు ఉపయోగపడుతోందని హీంగో వివరించాడు. పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన హీంగో, తన పాఠశాలలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, ప్రతిభతో జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడాను స్ఫూర్తిగా తీసుకున్నానని, సీనియర్ బౌలర్లు రూబెన్ ట్రంపెల్‌మన్, జేజే స్మిత్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని అతను పేర్కొన్నాడు.
Go Back to Shorts
Max Hingo
Namibia
T20 World Cup
India vs Namibia
Arun Jaitley Stadium
Gary Kirsten
Cricket
Kagiso Rabada
Namibia Cricket
T20 World Cup 2024

More Telugu News