Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర

Kollu Ravindra Criticizes Jagan for Visiting Those Who Abused and Were Beaten
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి విమర్శలు గుప్పించారు. ఆటవిక రాజ్యం అంటే ఎలా ఉంటుందో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ చూపించారని ఆయన అన్నారు. జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని వ్యంగ్యంగా అన్నారు. వైసీపీ ఆటవిక రాజ్యంలో హింసాత్మక ఘటనలను జగన్ ప్రోత్సహించారని విమర్శించారు. దేవాలయాల మీద, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారని దుయ్యబట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని పరామర్శించేందుకు జగన్ వెళుతున్నారని... పరామర్శలకు వెళుతూ విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. తెనాలిలో బ్లేడ్ బ్యాచ్ ను పరామర్శించి... ఇలాంటి వారిని తాను ప్రోత్సహిస్తాననే విధంగా సందేశం ఇచ్చారని విమర్శించారు. జగన్ చేతల వల్లే ఆ పార్టీ 151 నుంచి 11కి పడిపోయిందని అన్నారు. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని... లేకపోతే అథఃపాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Kollu Ravindra
YS Jagan
Andhra Pradesh
YCP
TDP
Andhra Politics
Jungle Raj
Violence
Tenali
Blade Batch

More Telugu News