Donald Trump: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

Donald Trump Center clarifies on agricultural products in US trade deal
  • రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్న కేంద్ర ప్రభుత్వం
  • అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు ససేమిరా
  • వెనెజువెలా చమురు కొనుగోలు చేస్తామన్న కేంద్రం
అమెరికాతో వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, రైతుల ప్రయోజనం అంశంపై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం జరిగిందని, అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పోస్టు నేపథ్యంలో విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం స్పందించింది.

అమెరికా మన దేశానికి ఎగుమతి చేసే వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు మొదటి నుంచి అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. వాణిజ్య ఒప్పందం నేపథ్యంలోనూ అదే విషయాన్ని స్పష్టం చేశామని పేర్కొంది. వెనెజువెలా చమురు కొనుగోలు అంశం పరిశీలలో ఉందని తెలిపింది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు మనం వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేయలేదని, ఇప్పుడు వాటిని ఎత్తివేశారని పేర్కొన్నారు. చమురు కొనుగోలు చేస్తామన్నారు.

అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు చాలా తక్కువకు వస్తాయి. వాటిపై సుంకాలు తగ్గిస్తే మన దేశంలో రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంతకాలం వాణిజ్య చర్చల ప్రతిష్ఠంభనకు ఇది ప్రధాన కారణం. మన రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి వాణిజ్యం ఒప్పందం కోసం కేంద్రం ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వాణిజ్య ఒప్పందం కుదరడంతో వస్తున్న విమర్శలకు కేంద్రం స్పష్టతనిచ్చింది.

More Telugu News

Donald Trump
US India trade deal
India agriculture
farmers welfare
trade agreement
agricultural products