మున్సిపల్ ఎన్నికలు... రెబల్స్‌కు జగ్గారెడ్డి గట్టి హెచ్చరిక

మున్సిపల్ ఎన్నికలు... రెబల్స్‌కు జగ్గారెడ్డి గట్టి హెచ్చరిక

Jaggareddy Warns Rebels in Municipal Elections
  • సంగారెడ్డి, సదాశివపేటలలో రెబల్స్ బెడద
  • పార్టీ నిర్ణయాన్ని కాదని బరిలో నిలిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరిక
  • సంగారెడ్డిలో ఎనిమిది వార్డుల్లో రెబల్స్ పోరు
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అభ్యర్థులకు హెచ్చరిక జారీ చేశారు. తనను, పార్టీ నిర్ణయాన్ని కాదని ఎవరైనా నామినేషన్ వేస్తే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

సంగారెడ్డి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వార్డుల్లో రెబల్స్ పోరు ఉంది. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటికే అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసింది. పోటీకి ఆసక్తి చూపుతున్న మిగిలిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుని పార్టీ బీ-ఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు సహకరించాలని జగ్గారెడ్డి సూచిస్తున్నారు.
Advertisement
Jaggareddy
Telangana Municipal Elections
Sangareddy
Sadashivpet
Congress Party
Rebel Candidates

More Telugu News