ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారిస్తున్న సిట్
- సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
- జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు.
ఇవాళ్టి విచారణలో బయటపడే అంశాల ఆధారంగా ఈ కేసు దిశ మారే అవకాశం ఉండటంతో, బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.