Priyanka Gandhi: స్పీకర్ టీ పార్టీకి హాజరైన మోదీ, ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Attends PM Modis Tea Party
షార్ట్స్‌లో చూడండి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. డిసెంబర్ 1న ప్రారంభమై 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు వాడీవేడి చర్చలు, విపక్షాల ఆందోళనలతో హోరెత్తాయి. పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు.

ముఖ్యంగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జీ-రామ్-జీ' బిల్లు తీవ్ర దుమారం రేపింది. విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, వారి నిరసనల మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. సమావేశాల చివరి రోజుల్లో ఈ బిల్లుపైనే ప్రధానంగా చర్చ జరిగింది.

సమావేశాలు ముగిసిన అనంతరం, స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

మరోవైపు, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి, తన నియోజకవర్గమైన వయనాడ్‌లోని రహదారుల సమస్యలపై చర్చించారు. 
Go Back to Shorts
Priyanka Gandhi
Narendra Modi
Parliament Winter Session
Supriya Sule
G-Ram-G Bill
MGNREGA
Wayanad
Nitin Gadkari
Delhi Pollution
Indian Politics

More Telugu News