Kavitha Kalvakuntla: ఆర్టీసీని ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది: కవిత
తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత హైదరాబాద్లో బస్సుల సంఖ్యను 7500 నుంచి 3500కు తగ్గించారని కవిత ఆరోపించారు. కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరంలో బస్సులు తగ్గించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకుండా హైదరాబాద్ను విశ్వనగరంగా ఎలా అభివృద్ధి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అక్టోబర్ 25 నుంచి 'జనంబాట' పేరుతో తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కవిత వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో వీధికుక్కల బెడద ఎక్కువైందని, పారిశుద్ధ్య కార్మికుల కొరతతో చెత్త పేరుకుపోతోందని కవిత అన్నారు. సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులతో పాటు, అంబర్పేట-ముషీరాబాద్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నగర ప్రజలకు కొండపోచమ్మ సాగర్ నుంచి తాగునీరు అందించాలని, పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆమె కోరారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత హైదరాబాద్లో బస్సుల సంఖ్యను 7500 నుంచి 3500కు తగ్గించారని కవిత ఆరోపించారు. కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరంలో బస్సులు తగ్గించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకుండా హైదరాబాద్ను విశ్వనగరంగా ఎలా అభివృద్ధి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అక్టోబర్ 25 నుంచి 'జనంబాట' పేరుతో తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కవిత వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో వీధికుక్కల బెడద ఎక్కువైందని, పారిశుద్ధ్య కార్మికుల కొరతతో చెత్త పేరుకుపోతోందని కవిత అన్నారు. సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులతో పాటు, అంబర్పేట-ముషీరాబాద్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నగర ప్రజలకు కొండపోచమ్మ సాగర్ నుంచి తాగునీరు అందించాలని, పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆమె కోరారు.