చైనా ఏం చేసిందంటే..?: ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా సంచలన నివేదిక

Operation Sindoor US Report on Chinas Actions
  • అమెరికా కాంగ్రెస్ నిపుణుల సంఘం నివేదిక
  • భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిందని ఆరోపణ
  • రఫేల్‌పై విశ్వాసాన్ని దెబ్బతీసి, జె-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా భావించిందని వెల్లడి
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, పాకిస్థాన్‌ మరియు పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన ఈ సైనిక చర్యపై అమెరికా కాంగ్రెస్ నిపుణుల సంఘం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో పలు సంచలన అంశాలను వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, కృత్రిమ మేధను ఉపయోగించి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని ఆరోపించింది. అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ తన వార్షిక నివేదికలో ఈ సంచలన అంశాలను ప్రస్తావించింది.

నివేదిక ప్రకారం, చైనా కృత్రిమ మేధస్సును ఉపయోగించి నకిలీ చిత్రాలను సృష్టించి, ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వాటిని ప్రచారం చేసింది. తాము తయారు చేసిన క్షిపణులు భారత్, ఫ్రాన్స్ (రఫేల్) యుద్ధ విమానాలను కూల్చివేశాయని చైనా ప్రచారం చేసుకుంది. దీని వెనుక ఒక వ్యూహం ఉందని, ప్రపంచవ్యాప్తంగా రఫేల్‌ యుద్ధ విమానాలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడమే ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశమని నివేదిక అభిప్రాయపడింది. అదే సమయంలో, తన సొంత జే-35 యుద్ధ విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది.

చైనా అనుసరిస్తున్న గ్రే జోన్ వ్యూహంలో అసత్య ప్రచారం ఒక భాగమని ఈ నిపుణుల సంఘం తన నివేదికలో పేర్కొంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు నెలల క్రితం చోటు చేసుకున్న ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని, చైనా తన ఆయుధ సంపత్తిని గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేసిందని తెలిపింది. ప్రత్యక్ష సైనిక ఘర్షణ లేకుండానే భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపడానికి చైనా వ్యూహాలను రచిస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
Go Back to Shorts
Operation Sindoor
China
India
America
Pakistan
POK
Artificial Intelligence
Rafale
J-35

More Telugu News