పాకిస్జాన్ 'ఎస్1 యూనిట్'... భారత్ లో అన్ని ఉగ్రదాడుల వెనుక ఉన్నది ఇదే!
- భారత్లో ఉగ్రదాడుల వెనుక పాక్ ఐఎస్ఐ రహస్య విభాగం
- 'సబ్ వెర్షన్ 1' (S1) పేరుతో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు
- పాకిస్థాన్ ఆర్మీ కల్నల్ నేతృత్వంలో కార్యకలాపాలు
- మాదకద్రవ్యాల డబ్బుతో ఉగ్రవాదానికి నిధుల సమీకరణ
- జైషే, లష్కరే వంటి సంస్థలకు రహస్యంగా శిక్షణ
- గత 25 ఏళ్లుగా భారత్నే లక్ష్యంగా చేసుకుని దాడులు
భారతదేశంలో దశాబ్దాలుగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల వెనుక పాకిస్థాన్కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)లోని ఓ రహస్య విభాగం కీలక పాత్ర పోషిస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'S1' అనే కోడ్ పేరుతో పనిచేస్తున్న ఈ యూనిట్, 1993 ముంబై వరుస పేలుళ్ల నుంచి ఇటీవల జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడి వరకు అనేక దుశ్చర్యలకు సూత్రధారి అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ వివరాలను ఎన్డీటీవీ తన కథనంలో వెల్లడించింది.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, 'S1' అంటే 'సబ్ వెర్షన్ 1'. పాకిస్థాన్లో సరిహద్దు ఉగ్రవాదాన్ని నడిపించే అతిపెద్ద శక్తి ఇదేనని తెలుస్తోంది. ఈ రహస్య విభాగానికి పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఒక కల్నల్ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తుండగా, 'గాజీ 1', 'గాజీ 2' అనే కోడ్ పేర్లతో ఇద్దరు అధికారులు క్షేత్రస్థాయి ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ యూనిట్ కార్యకలాపాలకు అవసరమైన నిధులను ఎక్కువగా మాదకద్రవ్యాల విక్రయం ద్వారానే సమకూర్చుకుంటున్నట్లు సమాచారం.
ఈ 'S1' యూనిట్లోని సిబ్బంది అన్ని రకాల బాంబులు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల (IED) తయారీలో నిపుణులు. చిన్నపాటి ఆయుధాలను వాడటంలోనూ వీరికి పూర్తి నైపుణ్యం ఉంది. అంతేకాకుండా, భారతదేశంలోని చాలా ప్రాంతాలకు సంబంధించిన సమగ్రమైన మ్యాప్లు వీరి వద్ద ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
గత 25 ఏళ్లుగా ఈ విభాగం చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ, దీని పూర్తి కార్యకలాపాల స్వరూపాన్ని భారత భద్రతా ఏజెన్సీలు ఇటీవలే డీకోడ్ చేయగలిగాయి. కేవలం భారత్లో దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేసే 'S1', పాకిస్థాన్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి అన్ని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉంది.
ఈ యూనిట్ సిబ్బంది ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లో పొడవాటి గడ్డాలు పెంచి, స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి ఉగ్రవాదులతో కలిసిపోతారు. తాము 'S1' విభాగానికి చెందిన వారమన్న విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. శిక్షణ తీసుకుంటున్న ఉగ్రవాద గ్రూపులకు కూడా తమ ట్రైనర్లు ఎవరనేది తెలియకుండా జాగ్రత్త పడతారు. గడిచిన రెండు దశాబ్దాల్లో 'S1' వేలాది మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, 'S1' అంటే 'సబ్ వెర్షన్ 1'. పాకిస్థాన్లో సరిహద్దు ఉగ్రవాదాన్ని నడిపించే అతిపెద్ద శక్తి ఇదేనని తెలుస్తోంది. ఈ రహస్య విభాగానికి పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఒక కల్నల్ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తుండగా, 'గాజీ 1', 'గాజీ 2' అనే కోడ్ పేర్లతో ఇద్దరు అధికారులు క్షేత్రస్థాయి ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ యూనిట్ కార్యకలాపాలకు అవసరమైన నిధులను ఎక్కువగా మాదకద్రవ్యాల విక్రయం ద్వారానే సమకూర్చుకుంటున్నట్లు సమాచారం.
ఈ 'S1' యూనిట్లోని సిబ్బంది అన్ని రకాల బాంబులు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల (IED) తయారీలో నిపుణులు. చిన్నపాటి ఆయుధాలను వాడటంలోనూ వీరికి పూర్తి నైపుణ్యం ఉంది. అంతేకాకుండా, భారతదేశంలోని చాలా ప్రాంతాలకు సంబంధించిన సమగ్రమైన మ్యాప్లు వీరి వద్ద ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
గత 25 ఏళ్లుగా ఈ విభాగం చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ, దీని పూర్తి కార్యకలాపాల స్వరూపాన్ని భారత భద్రతా ఏజెన్సీలు ఇటీవలే డీకోడ్ చేయగలిగాయి. కేవలం భారత్లో దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేసే 'S1', పాకిస్థాన్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి అన్ని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉంది.
ఈ యూనిట్ సిబ్బంది ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లో పొడవాటి గడ్డాలు పెంచి, స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి ఉగ్రవాదులతో కలిసిపోతారు. తాము 'S1' విభాగానికి చెందిన వారమన్న విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. శిక్షణ తీసుకుంటున్న ఉగ్రవాద గ్రూపులకు కూడా తమ ట్రైనర్లు ఎవరనేది తెలియకుండా జాగ్రత్త పడతారు. గడిచిన రెండు దశాబ్దాల్లో 'S1' వేలాది మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.