మాంసం వినియోగం: అమెరికా టాప్.. భారత్ చాలా వెనుక!
- మాంసం వినియోగంలో అమెరికా, ఆస్ట్రేలియా అగ్రస్థానం
- ఏడాదికి తలసరి 110 కేజీలకు పైగా తింటున్న వైనం
- అత్యల్పంగా మాంసం తినే దేశాల జాబితాలో భారత్
- పేదరికం, సంస్కృతి, ఆహార అలవాట్లే ప్రధాన కారణం
- మాంసం వినియోగం 90 శాతం తగ్గితేనే పర్యావరణానికి మేలు
- ప్రొటీన్ల కోసం పప్పుధాన్యాలు తినాలని నిపుణుల సూచన
ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో నెలకొంది. ఈ ప్రాంతాల్లో మాంసం ధరలు అధికంగా ఉండటం, సాంస్కృతిక కారణాల వల్ల దాని వినియోగం చాలా తక్కువగా ఉంది. 2022 సంవత్సరానికి భారత్ డేటా అందుబాటులో లేనప్పటికీ, గత గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ మాంసం వినియోగం ప్రపంచంలోనే అతి తక్కువగా ఉండే దేశాల జాబితాలో ఉంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే, యుద్ధం, సరఫరా సమస్యలతో సతమతమవుతున్న సిరియా, యెమెన్, ఉత్తర కొరియా వంటి దేశాల్లో కూడా ప్రజలు మాంసానికి దూరంగా ఉంటున్నారు.
అయితే, అధిక మాంసం వినియోగం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను అదుపులో ఉంచాలంటే పశ్చిమ దేశాలు తమ మాంసం వినియోగాన్ని 90 శాతం మేర తగ్గించుకోవాలని 2018లో ప్రఖ్యాత 'నేచర్' పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మాంసం ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఏర్పడే పోషకాహార లోటును భర్తీ చేసేందుకు బీన్స్, ఇతర పప్పుధాన్యాల వాడకాన్ని పెంచుకోవాలని ఆ అధ్యయనం సూచించింది. ఇది పర్యావరణ హితకరమైన ప్రోటీన్ సరఫరాకు దోహదపడుతుందని పేర్కొంది.