ప్రభుత్వ శాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డి లేఖ
- ప్రైవేటు ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారన్న చిన్నారెడ్డి
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
- వేతనాలు కూడా ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారని విమర్శ
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, అయితే వారిని ప్రైవేటు ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు.
ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వకపోవడంతో పాటు దాదాపు 20 శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ వేతనాలు కూడా ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారని వాపోయారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం 2023 కంపెనీస్ యాక్ట్ 8 ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూడా ఇదే తరహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి కోరారు.
ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వకపోవడంతో పాటు దాదాపు 20 శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ వేతనాలు కూడా ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారని వాపోయారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం 2023 కంపెనీస్ యాక్ట్ 8 ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూడా ఇదే తరహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి కోరారు.